బుధవారం నందమూరి బాలకృష్ణ షష్టి పూర్తి. ఈ ప్రత్యేక సందర్భాన ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఘనంగానే వేడుకలు జరుపుకున్నారు. ఐతే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కానీ.. అభిమానులు కానీ ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం లేకపోయింది. ఇదంతా కరోనా పుణ్యమే. అయితే మామూలు రోజుల్లో అయితే బాలయ్య 60వ జన్మదిన వేడుకలు ఎలా జరిగి ఉండేవన్న ఆలోచనలో ఉన్నారు అభిమానులు.
ఒకవేళ చిరంజీవి 60వ జన్మదినానికి జరిగినట్లే.. శిల్ప కళా వేదిక లాంటి చోట వేడుకలు చేసేవాళ్లా.. ఎవరైనా సినీ జనాలు దానికి హాజరయ్యేవాళ్లా.. బాలయ్య ఫిలిం ఇండస్ట్రీకి పార్టీ ఏమైనా ఇచ్చేవాడా.. దానికి ఎవరెవరు హాజరయ్యేవారు అన్న ఊహల్లో అభిమానులు ఉన్నారు.
ఐతే ఇదే ఊహతో ఓ అభిమాని.. వావ్ ఒక ఆర్ట్ తయారు చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య 60వ పుట్టిన రోజు వేడుకల్ని టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి దగ్గరుండి జరిపిస్తన్నట్లుగా ఉంది ఆ ఆర్ట్. సోఫాలో బాలయ్య పక్కనే చిరు కూర్చుని కేక్ కట్ చేయించే పనిలో ఉండగా.. వారి ముందు నాగ్, వెంకీ కుర్చీల్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నారు.
ఇటు, అటు పక్కన, ముందు, వెనుక మిగతా స్టార్లున్నట్లుగా దీన్ని తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రానా, నాని, శర్వానంద్, నాగచైతన్య, మంచు మనోజ్, రామ్, నితిన్.. ఇలా దాదాపు అందరు టాలీవుడ్ స్టార్లనూ ఇందులో కవర్ చేశారు.
వంటలో మంచి నైపుణ్యం ఉన్న ఎన్టీఆర్ వెనుక గరిట తిప్పుతుంటే రామ్ అతడికి సాయం చేస్తున్నట్లు.. చరణ్ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చూపించడం విశేషం. ఈ ఆర్ట్ చూసి నిజంగా టాలీవుడ్ అంతా కలిసి బాలయ్య షష్టిపూర్తి వేడుకలు జరిపిస్తే ఎంత బావుణ్నో అనుకుంటున్నారు సినీ అభిమానులు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…