బుధవారం నందమూరి బాలకృష్ణ షష్టి పూర్తి. ఈ ప్రత్యేక సందర్భాన ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఘనంగానే వేడుకలు జరుపుకున్నారు. ఐతే సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు కానీ.. అభిమానులు కానీ ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం లేకపోయింది. ఇదంతా కరోనా పుణ్యమే. అయితే మామూలు రోజుల్లో అయితే బాలయ్య 60వ జన్మదిన వేడుకలు ఎలా జరిగి ఉండేవన్న ఆలోచనలో ఉన్నారు అభిమానులు.
ఒకవేళ చిరంజీవి 60వ జన్మదినానికి జరిగినట్లే.. శిల్ప కళా వేదిక లాంటి చోట వేడుకలు చేసేవాళ్లా.. ఎవరైనా సినీ జనాలు దానికి హాజరయ్యేవాళ్లా.. బాలయ్య ఫిలిం ఇండస్ట్రీకి పార్టీ ఏమైనా ఇచ్చేవాడా.. దానికి ఎవరెవరు హాజరయ్యేవారు అన్న ఊహల్లో అభిమానులు ఉన్నారు.
ఐతే ఇదే ఊహతో ఓ అభిమాని.. వావ్ ఒక ఆర్ట్ తయారు చేశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య 60వ పుట్టిన రోజు వేడుకల్ని టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కలిసి దగ్గరుండి జరిపిస్తన్నట్లుగా ఉంది ఆ ఆర్ట్. సోఫాలో బాలయ్య పక్కనే చిరు కూర్చుని కేక్ కట్ చేయించే పనిలో ఉండగా.. వారి ముందు నాగ్, వెంకీ కుర్చీల్లో కూర్చుని నవ్వులు చిందిస్తున్నారు.
ఇటు, అటు పక్కన, ముందు, వెనుక మిగతా స్టార్లున్నట్లుగా దీన్ని తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రానా, నాని, శర్వానంద్, నాగచైతన్య, మంచు మనోజ్, రామ్, నితిన్.. ఇలా దాదాపు అందరు టాలీవుడ్ స్టార్లనూ ఇందులో కవర్ చేశారు.
వంటలో మంచి నైపుణ్యం ఉన్న ఎన్టీఆర్ వెనుక గరిట తిప్పుతుంటే రామ్ అతడికి సాయం చేస్తున్నట్లు.. చరణ్ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చూపించడం విశేషం. ఈ ఆర్ట్ చూసి నిజంగా టాలీవుడ్ అంతా కలిసి బాలయ్య షష్టిపూర్తి వేడుకలు జరిపిస్తే ఎంత బావుణ్నో అనుకుంటున్నారు సినీ అభిమానులు.
This post was last modified on June 10, 2020 11:12 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…