‘పుష్ప’ సినిమా థియేటర్లలో ఇంకా బాగా ఆడుతుండగానే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబరు 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. సరిగ్గా 20 రోజుల తర్వాత అమేజాన్ ప్రైమ్ ద్వారా డిజిటల్లో రిలీజైంది. ఈపాటికి ‘ఆర్ఆర్ఆర్’ థియేటర్లలోకి దిగి ఉంటుంది కాబట్టి.. ‘పుష్ప’ థియేట్రికల్ రన్ ముగిసిపోతుందన్న ఉద్దేశంతో ముందే ఈ మేరకు ఒప్పందం చేసుకుంది నిర్మాణ సంస్థ. తీరా చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడిపోయి ‘పుష్ప’ ఇంకా థియేటర్లలో బాగా ఆడుతుండగానే ఈ సినిమా ప్రైమ్లోకి వచ్చేసింది.
కాకపోతే హిందీ వెర్షన్ మంచి షేర్ రాబడుతుండటంతో దాని వరకు ఎలాగోలా ఆపగలిగారు. ఆ వెర్షన్ ప్రైమ్లోకి రాలేదు. ఇక ‘పుష్ప’ను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లు.. అలాగే థియేటర్లలో చూసి ఇంకోసారి ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్లు ఎగబడి సినిమాను చూస్తున్నట్లే కనిపిస్తోంది. ‘పుష్ప’ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ.
థియేటర్లలో ‘పుష్ప’ సినిమా చూసిన వాళ్లకు ఎక్స్ట్రా కిక్కు ఇచ్చేలా ఓటీటీ వెర్షన్ ఉండటం విశేషం. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సమంత పాట ‘ఊ అంటావా ఊహూ అంటావా’ లెంగ్త్ కాస్త పెంచారు. సమంత హాట్ పోజులు, స్టెప్పులు ఇంకొన్ని జోడించడం విశేషం. సినిమాలో ఈ పాట హడావుడిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. సమంత హాట్ స్టెప్పులను తనివి తీరా ఆస్వాదించలేకపోయామే అనుకున్న వాళ్లకు.. ఓటీటీ వెర్షన్ల్ సాంగ్ పూర్తి సంతృప్తినిస్తోంది. థియేటర్లలో ముందుగా ఈ సినిమా రిలీజైనపుడు డిజిటల్ ఇంటర్మీడియట్ కూడా సరిగా చేయకపోవడంతో ఈ పాట కొంచెం మసక మసకగా కూడా అనిపించిన మాట వాస్తవం.
ఐతే ఓటీటీ వెర్షన్లో ఆ లోటు కనిపించడం లేదు. బెటర్ వెర్షనే రిలీజ్ చేసినట్లున్నారు. ఓవరాల్గా సినిమా ఇంపాక్ట్ వేరుగా ఉంది. ఇంకోవైపు ఓటీటీ వెర్షన్లో ఒక కీలక సన్నివేశాన్ని కూడా జోడించారు. సినిమా ఆరంభంలో హీరో పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశం అది. మిల్లులో పని మానేసి వచ్చేశాక ఊర్లో ఒక వ్యక్తి పుష్ప తల్లి చేసిన అప్పు తీర్చలేదని నానా మాటలు అనడం, పుష్ప తమ ఆవును అమ్మి ఆ అప్పు తీర్చేసి.. తన తల్లిని ఎవరి ముందైతే అవమానించాడో వాళ్లందరి ఇళ్ల ముందుకు తీసుకెళ్లి ఆ వ్యక్తిని కొడుతూ అప్పు తీర్చేసినట్లు చెప్పిస్తాడీ సన్నివేశంలో. మంచి ఎలివేషన్ ఉన్న ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి ఎందుకు తీసేశారో అనిపిస్తోంది. బహుశా లెంగ్త్ ఎక్కువైందని దీన్ని పక్కన పెట్టారేమో.
This post was last modified on January 8, 2022 12:22 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…