కొన్నేళ్లుగా తన అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి బాలకృష్ణ స్పందిస్తున్న తీరే చిత్రంగా ఉంటోంది. హరికృష్ణ చనిపోయినపుడు మినహాయిస్తే తారక్తో బాలయ్య సన్నిహితంగా కనిపించింది లేదు. అతడి ప్రస్తావన వచ్చినపుడు కూడా తేలిగ్గా మాట్లాడుతుంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తారక్ రాజకీయ అరంగేట్రం గురించి అడిగితే.. ఎవరిష్టం వాళ్లది సమాధానం దాటవేశాడు బాలయ్య. ఇప్పుడు తారక్ పట్ల బాలయ్య ఉద్దేశాలపై సందేహాలు రేకెత్తించేలా మాట్లాడాడు బాలయ్య.
తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి అడిగితే బాలయ్య ఆసక్తికర రీతిలో స్పందించారు. మోక్షజ్ఞ తప్పకుండా సినిమాల్లోకి వస్తాడని అన్న బాలయ్య సరైన సమయం, సందర్భం చూసి అతను అరంగేట్రం చేస్తాడన్నారు. అతను సినిమాల్లో కచ్చితంగా రాణిస్తాడని కూడా ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య ఓ మాటను నొక్కి నొక్కి చెప్పారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మోక్షజ్ఞదే అన్నాడు. ఐతే తన తర్వాతి తరంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇప్పటికే నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని బాలయ్య ఎందుకు గుర్తించడం లేదన్నది ప్రశ్న. కళ్యాణ్ రామ్ సంగతి పక్కన పెట్టేసినా తారక్ సూపర్ స్టార్ రేంజ్ అందుకుని నందమూరి లెగసీని నిలబెడుతున్నాడు.
అసలు బాలయ్య వరుస డిజాస్టర్లతో పూర్తిగా ప్రభ కోల్పోయిన సమయంలో నందమూరి లెగసీని కాపాడింది తారకే. బాలయ్య స్లంప్లో ఉండగా నందమూరి అభిమానులు డీలా పడిపోకుండా వారికి ఎనర్జీని నింపింది తారక్. అతను బాలయ్యను మించి ఎదిగాడు. బాలయ్య తర్వాతి తరంలో నందమూరి వంశానికి టార్చ్ బేరర్గా ఉన్నాడు. మరి బాలయ్య అతణ్ని గుర్తించకుండా తన కొడుకుదే నందమూరి నట వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత అనడం ఆశ్చర్యం.
This post was last modified on June 10, 2020 5:49 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…