Movie News

మెగా 154లో శృతి హాసన్..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడే అవకాశాలు దక్కించుకుంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ఆశించించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయింది. దీంతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ‘క్రాక్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తరువాత శృతికి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో శృతిని హీరోయిన్ గా తీసుకున్నారు.

మరికొద్దిరోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. 
ఇప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇందులో హీరోయిన్ గా శృతిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇంకా ఈ ప్రాజెక్ట్ పై సైన్ చేయలేదట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. దాదాపు ఆమె ఈ సినిమాలో నటించడం ఖాయమని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు పోస్టర్స్ ను విడుదల చేశారు. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 

This post was last modified on January 6, 2022 4:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

13 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

43 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago