‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ హీరో ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారు. అదే ‘రావణాసుర’. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించనున్న ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నారు.
ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అలానే విలన్ గా కూడా ఓ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. దక్ష నగర్కార్. ‘హోరా హోరీ’, ‘హుషారు’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గా ‘జాంబీరెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది.
ఇప్పుడేమో రవితేజ సినిమాలో లేడీ విలన్ గా ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి దక్ష చాలా ఎగ్జైటెడ్ గా ఉందట. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. అయితే మెయిన్ విలన్ గా మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది.
కానీ దక్ష రోల్ మాత్రం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో హీరో పది తలలున్న రావణుడిగా కనిపించారు.
This post was last modified on January 5, 2022 7:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…