Movie News

రవితేజ సినిమాలో లేడీ విలన్!

‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ హీరో ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారు. అదే ‘రావణాసుర’. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించనున్న ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నారు. 

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అలానే విలన్ గా కూడా ఓ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. దక్ష నగర్కార్. ‘హోరా హోరీ’, ‘హుషారు’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గా ‘జాంబీరెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. 

ఇప్పుడేమో రవితేజ సినిమాలో లేడీ విలన్ గా ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి దక్ష చాలా ఎగ్జైటెడ్ గా ఉందట. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. అయితే మెయిన్ విలన్ గా మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ దక్ష రోల్ మాత్రం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 
ఇక ఈ సినిమాలో ర‌వితేజ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నారు.  డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్,  RT టీమ్‌ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో హీరో పది తలలున్న రావణుడిగా కనిపించారు.

This post was last modified on January 5, 2022 7:02 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

1 hour ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

4 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

4 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

5 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

6 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

7 hours ago