Movie News

రవితేజ సినిమాలో లేడీ విలన్!

‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఈ హీరో ప్రస్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నారు. అదే ‘రావణాసుర’. దర్శకుడు సుధీర్ వర్మ రూపొందించనున్న ఈ సినిమాను జనవరి 14న గ్రాండ్ గా లాంఛ్ చేయనున్నారు. 

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అలానే విలన్ గా కూడా ఓ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. దక్ష నగర్కార్. ‘హోరా హోరీ’, ‘హుషారు’ వంటి సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ రీసెంట్ గా ‘జాంబీరెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించింది. 

ఇప్పుడేమో రవితేజ సినిమాలో లేడీ విలన్ గా ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడానికి దక్ష చాలా ఎగ్జైటెడ్ గా ఉందట. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. అయితే మెయిన్ విలన్ గా మరొకరిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

కానీ దక్ష రోల్ మాత్రం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 
ఇక ఈ సినిమాలో ర‌వితేజ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నారు.  డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్,  RT టీమ్‌ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేయగా.. అందులో హీరో పది తలలున్న రావణుడిగా కనిపించారు.

This post was last modified on January 5, 2022 7:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

25 minutes ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

1 hour ago

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని…

6 hours ago

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…

8 hours ago

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…

8 hours ago

నాగ్ అశ్విన్‌ను డిప్రెషన్లోకి నెట్టిన ‘ఇన్సెప్షన్’

డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…

9 hours ago