Movie News

‘నాయట్టు’ రీమేక్.. ఆగిపోవడానికి కారణమిదే!

మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’ అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంది గీతాఆర్ట్స్ సంస్థ. దీంతో వెంటనే రీమేక్ రైట్స్ కొనేసి.. దర్శకుడిగా కరుణ కుమార్ ను రంగంలోకి దించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘పలాస’ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఈ రీమేక్ ను కూడా నేటివ్ టచ్ తో డీల్ చేస్తారని దర్శకత్వ బాధత్యలు అప్పగించారు. సినిమా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక షూటింగ్ మొదలవ్వడమే ఆలస్యమనుకుంటున్న సమయంలో ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. దానికి కారణం ఏంటనేది మాత్రం బయటకు రాలేదు. కరుణ కుమార్ వేరే బ్యానర్ లో మరో సినిమా చేయాలని చూస్తున్నారు.

సడెన్ గా ఈ రీమేక్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటని ఆరా తీయగా.. సినిమా బడ్జెట్ సమస్యలే కారణమని తెలుస్తోంది. ఈ సినిమాను రూ.4 కోట్లలో తీయాలని దర్శకుడు కరుణకుమార్ కు చెప్పారు. కానీ బడ్జెట్ లెక్కలు వేసుకున్నప్పుడు రూ.8 కోట్లు వచ్చిందట. దర్శకుడు రూ.1.25 కోట్ల ప్యాకేజీ అడిగారని సమాచారం. నటుడు రావు రమేష్ కి రూ.కోటి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందట.

రూ.8 కోట్లలో సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా..? లేదా..? అనే సందేహాలు నిర్మాతల్లో కలిగాయి. అందుకే సినిమాను  ఆరంభంలోనే ఆపేశారు. ఇప్పుడు ‘నాయట్టు’ డబ్బింగ్ రైట్స్ కూడా గీతాఆర్ట్స్ దగ్గరే ఉండడంతో.. ఇప్పుడు సినిమాను తెలుగులో డబ్ చేసి ‘ఆహా’లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. దర్శకుడు కరుణకుమార్ కి ఆల్రెడీ అడ్వాన్స్ ఇవ్వడంతో.. ఆయనతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి!

This post was last modified on January 3, 2022 10:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago