ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయనుకుంటే.. ఇప్పుడు ఒక్కో సినిమా వాయిదా పడుతుంది. ఇప్పటికే రాజమౌళి అండ్ కో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు. ఢిల్లీ, ముంబై లాంటి సిటీల్లో కర్ఫ్యూలు విధించడం, తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ అక్యుపెన్సీ యాభై శాతం పెట్టడం, ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇలా పలు కారణాల వలన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది.
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవ్వబోతుందని సమాచారం. ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు మేకర్స్. ‘రాధేశ్యామ్’కి నార్త్ ఇండియన్ మార్కెట్ చాలా కీలకం.
కానీ ఇప్పుడు ఉత్తరాదిన పార్షియల్ లాక్ డౌన్ పెట్టేశారు. అందుకే ప్రభాస్ సినిమాను కూడా వాయిదా వేయాలని చూస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రబృందం ప్రమోషన్స్ ను ఆపేసింది. ప్రభాస్ కూడా షెడ్యూల్ చేసిన మీడియా ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా వాయిదా పడిందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని ఈ వారంలోనే అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. రాబోయే నెలల్లో ఏదొక డేట్ ను లాక్ చేయాలని చూస్తుంది ‘రాధేశ్యామ్’ టీమ్. సంక్రాంతికి చూడాలనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. పోనీ.. ప్రభాస్ సినిమా ఉంది కదా.. అని హ్యాపీ ఫీల్ అవుతున్న అభిమానులకు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నారు. ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడితే ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on January 3, 2022 2:49 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…