ఈ సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయనుకుంటే.. ఇప్పుడు ఒక్కో సినిమా వాయిదా పడుతుంది. ఇప్పటికే రాజమౌళి అండ్ కో.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వాయిదా వేసినట్లు అనౌన్స్ చేశారు. ఢిల్లీ, ముంబై లాంటి సిటీల్లో కర్ఫ్యూలు విధించడం, తమిళనాడు రాష్ట్రంలో థియేటర్ అక్యుపెన్సీ యాభై శాతం పెట్టడం, ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇలా పలు కారణాల వలన ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా పడింది.
ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమా కూడా ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవ్వబోతుందని సమాచారం. ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు మేకర్స్. ‘రాధేశ్యామ్’కి నార్త్ ఇండియన్ మార్కెట్ చాలా కీలకం.
కానీ ఇప్పుడు ఉత్తరాదిన పార్షియల్ లాక్ డౌన్ పెట్టేశారు. అందుకే ప్రభాస్ సినిమాను కూడా వాయిదా వేయాలని చూస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రబృందం ప్రమోషన్స్ ను ఆపేసింది. ప్రభాస్ కూడా షెడ్యూల్ చేసిన మీడియా ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా వాయిదా పడిందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయాన్ని ఈ వారంలోనే అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. రాబోయే నెలల్లో ఏదొక డేట్ ను లాక్ చేయాలని చూస్తుంది ‘రాధేశ్యామ్’ టీమ్. సంక్రాంతికి చూడాలనుకున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. పోనీ.. ప్రభాస్ సినిమా ఉంది కదా.. అని హ్యాపీ ఫీల్ అవుతున్న అభిమానులకు ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నారు. ‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడితే ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.
This post was last modified on January 3, 2022 2:49 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…