మన సాయిధరమ్ తేజ్ లాగే కోలీవుడ్లో ఒక వారసత్వ హీరో తన తొలి సినిమా విషయంలో విపరీతమైన టెన్షన్ ఎదుర్కొన్నాడు. అతనే.. ధ్రువ్ విక్రమ్. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే పెద్ద స్టార్లలో ఒకడైన విక్రమ్ తనయుడీ కుర్రాడు. తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన బాలా దర్శకత్వంలో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలన్న విక్రమ్ నిర్ణయం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అర్జున్ రెడ్డి రీమేక్ను ఆయన చేతుల్లో పెడితే సినిమా పూర్తయ్యాక దాని ప్రోమోలు చూసి ఒక్కొక్కరు బెంబేలెత్తిపోయారు.
తీవ్ర విమర్శలు రావడంతో ఆ వెర్షన్ మొత్తం డస్ట్ బిన్లో పడేసి.. అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్యతో మళ్లీ సినిమా తీయించి ఆదిత్య వర్మ పేరుతో రిలీజ్ చేస్తే అది ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ధ్రువ్.. తన తండ్రితో కలిసి మహాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సినిమాలకు సంబంధించిన విషయంతో కాకుండా వ్యక్తిగత వ్యవహారంతో ధ్రువ్ వార్తల్లోకి వచ్చాడు.
తన తొలి చిత్రం ఆదిత్య వర్మలో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ బానిత సంధుతో అతను ప్రేమలో ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదేమీ ఊరికే వచ్చిన పుకారు కాదు. ఆదిత్య వర్మ విడుదలై రెండేళ్లు దాటిపోగా.. వీళ్లిద్దరూ ఇప్పటికీ చాలా క్లోజ్గా కనిపిస్తుండటం.. ఇద్దరూ కలిసి ఫారిన్ టూర్కు కూడా వెళ్లడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బలంగా వార్తలొస్తున్నాయి.
తాజాగా ధ్రువ్, బానిత కలిసి దుబాయ్కి వెళ్లారు. అక్కడే బుర్జ్ ఖలీఫాకు దగ్గర్లో ఒక హోటల్లో ఉండి నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. హోటల్ గది నుంచి బానిత బుర్జ్ ఖలీఫాను చూస్తున్న వీడియోను ధ్రువ్యే స్వయంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి ధ్రువ్, బానిత ప్రేమలో ఉన్నట్లే అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. బానిత ఆదిత్య వర్మ తర్వాత తమిళంలో సినిమాలేవీ చేయలేదు. ఇటీవల విక్కీ కౌశల్ మూవీ సర్దార్ ఉద్దమ్లో ఆమె కనిపించింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…