మాస్ రాజా రవితేజ కెరీర్లో అస్సలు గుర్తు పెట్టుకోలేని కొన్ని సినిమాలున్నాయి. ఆ సినిమాలను రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అన్ని సినిమాల ఫలితాలనూ అంచనా వేయడం కష్టం, కొన్నిసార్లు మంచి సినిమాలకు కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ కొన్ని సినిమాల ఫలితం ఏంటో చాలా ముందే తెలిసిపోతుంటుంది. ఆ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు చుక్కలు చూపించేస్తాయి.
ఆరంభం నుంచి చివరి దాకా డిజాస్టర్ ఫీల్స్ ఉంటాయి ఆ చిత్రాలు చూస్తుంటే. మాస్ రాజా కెరీర్లో అలాంటి ఒక సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. తనకు నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి హిట్లు ఇచ్చాడన్న కృతజ్ఞతతోనో ఏమో.. శ్రీను వైట్ల వరుస డిజాస్టర్లతో స్లంప్లో ఉన్న టైంలో అతడికి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్లో భారీ బడ్జెట్లో ఈ సినిమా తీశారు.
కానీ అది పెద్ద డిజాస్టర్ అయింది.ఆ సినిమా గురించి తాజాగా బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో రవితేజ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రవితేజ యుఎస్లో ఉన్న ఒక ఫొటోను బాలయ్య ఈ షోలో స్క్రీన్ మీద డిస్ప్లే చేసి దాని గురించి చెప్పమని అడిగాడు. అది ఒక సినిమా షూటింగ్ టైంలో తీసిన ఫొటో అంటూ.. ఆ సినిమా గురించి ఊహించని వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ‘‘ఈ ఫొటో అమెరికా తీసింది. ఒక కళాఖండం లాంటి సినిమా షూటింగ్ టైంలో. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలనుందా మీకు? అమర్ అక్బర్ ఆంటోని. అది పెద్ద కళాఖండం’’ అన్నాడు రవితేజ.
ఇందులో నువ్వు అమరా, అక్బరా, ఆంటోనీనా అని బాలయ్య అడగ్గా.. ‘‘మూడూ.. ఆ సినిమా చూడలేదా మీరు’’ అన్నాడు రవితేజ. బాలయ్య చూడలేదని చెప్పగా.. ‘‘మీరేం మిస్సయిపోలేదు. చూడక్కర్లా’’ అన్నాడు మాస్ రాజా. రాడ్ రంబోలానా అని బాలయ్య అంటే.. మామూలు రాడ్ కాదు.. రాడ్డుకే రాడ్ అని రవితేజ ముగించాడు. ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. ‘అమర్ అక్బర్ ఆంటోని’ గురించి మాస్ రాజా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీన్ని బట్టే ఆ సినిమా ఫలితం మాస్ రాజాను ఎంత డిస్టర్బ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…