మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కొన్నేళ్ల కిందట ‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీని తర్వాత ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమా చేశాడతను. కానీ అది అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దాని రిలీజ్ సంగతేంటో తేలలేదు. ఐతే ఈ లోపు కళ్యాణ్ మరో సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేశాడు. అదే.. కిన్నెరసాని.
నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమిది. కళ్యాణ్ సరసన మలయాళ అమ్మాయి శీతల్ నటించింది. మలయాళ హిట్ మూవీ ‘ఇష్క్’తో మంచి పేరు సంపాదించిన శీతల్కు ఇదే తొలి తెలుగు చిత్రం. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించాడీ సినిమాలో.
షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమవుతున్న ‘కిన్నెరసాని’ నుంచి తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.ట్రైలర్ ఆద్యంతం ఇంటెన్స్గా, ఇంట్రెస్టింగ్గానే కనిపించింది. కథాకథనాలు రొటీన్కు భిన్నంగా అనిపించాయి. నరేషన్లోనూ కొత్తదనం కనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి. మహతి స్వర సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. టెక్నికల్గా సినిమాకు అన్నీ బాగా కుదిరినట్లున్నాయి. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కూడా బాగుంది. కళ్యాణ్ దేవ్ తొలి చిత్రంతో పోలిస్తే చాలా బెటర్గా అనిపించాడు. అతడి లుక్ కూడా ఓకే. కొత్తదనం కోరుకునే వాళ్లు చూడదగ్గ సినిమాలాగే కనిపిస్తోంది ‘కిన్నెరసాని’.
ఐతే ట్రైలర్లో అన్నీ బాగున్నప్పటికీ.. అసలు ఈ సినిమా కథేంటన్నదే అర్థం కావడం లేదు. ట్రైలర్ ఉద్దేశమే కథ గురించి ఎంతో కొంత చెప్పడం, ఎలాంటి సినిమా చూడబోతున్నామో సంకేతాలు ఇవ్వడమే. కానీ ‘కిన్నెరసాని’ ట్రైలర్ రెండు మూడుసార్లు చూసినా కూడా దీని కథేంటన్నది ఐడియా రాని పరిస్థితి. బహుశా థియేటర్లో సర్ప్రైజ్ చేయాలని ఆ గుట్టు విప్పట్లేదేమో. మరి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో అయినా కళ్యాణ్ దేవ్ తొలి విజయాన్నందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on December 30, 2021 2:24 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…