మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ కొన్నేళ్ల కిందట ‘విజేత’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా అతడికి నిరాశనే మిగిల్చింది. కంటెంట్ పరంగా యావరేజే అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీని తర్వాత ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమా చేశాడతను. కానీ అది అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. దాని రిలీజ్ సంగతేంటో తేలలేదు. ఐతే ఈ లోపు కళ్యాణ్ మరో సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేశాడు. అదే.. కిన్నెరసాని.
నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమిది. కళ్యాణ్ సరసన మలయాళ అమ్మాయి శీతల్ నటించింది. మలయాళ హిట్ మూవీ ‘ఇష్క్’తో మంచి పేరు సంపాదించిన శీతల్కు ఇదే తొలి తెలుగు చిత్రం. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించాడీ సినిమాలో.
షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్ధమవుతున్న ‘కిన్నెరసాని’ నుంచి తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.ట్రైలర్ ఆద్యంతం ఇంటెన్స్గా, ఇంట్రెస్టింగ్గానే కనిపించింది. కథాకథనాలు రొటీన్కు భిన్నంగా అనిపించాయి. నరేషన్లోనూ కొత్తదనం కనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి. మహతి స్వర సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. టెక్నికల్గా సినిమాకు అన్నీ బాగా కుదిరినట్లున్నాయి. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కూడా బాగుంది. కళ్యాణ్ దేవ్ తొలి చిత్రంతో పోలిస్తే చాలా బెటర్గా అనిపించాడు. అతడి లుక్ కూడా ఓకే. కొత్తదనం కోరుకునే వాళ్లు చూడదగ్గ సినిమాలాగే కనిపిస్తోంది ‘కిన్నెరసాని’.
ఐతే ట్రైలర్లో అన్నీ బాగున్నప్పటికీ.. అసలు ఈ సినిమా కథేంటన్నదే అర్థం కావడం లేదు. ట్రైలర్ ఉద్దేశమే కథ గురించి ఎంతో కొంత చెప్పడం, ఎలాంటి సినిమా చూడబోతున్నామో సంకేతాలు ఇవ్వడమే. కానీ ‘కిన్నెరసాని’ ట్రైలర్ రెండు మూడుసార్లు చూసినా కూడా దీని కథేంటన్నది ఐడియా రాని పరిస్థితి. బహుశా థియేటర్లో సర్ప్రైజ్ చేయాలని ఆ గుట్టు విప్పట్లేదేమో. మరి జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో అయినా కళ్యాణ్ దేవ్ తొలి విజయాన్నందుకుంటాడేమో చూడాలి.
This post was last modified on December 30, 2021 2:24 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…