ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్కు ఇంకో పది రోజుల సమయం కూడా లేదు. ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేుయడానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. విదేశాల్లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి. త్వరలోనే ఇండియాలోనూ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు.
ఈ టైంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించే సూచనలు కనిపిస్తుండటంతో ఈ సినిమా విడుదలై సందేహాలు మొదలయ్యాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ఆంక్షల దిశగా అడుగులు పడుతున్నాయి. ఢిల్లీలో థియేటర్లు మూత వేసేశారు ఆల్రెడీ. దీంతో హిందీ మూవీ ‘జెర్సీ’ రిలీజ్ ఆగిపోయింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ కూడా వాయిదా పడక తప్పదేమో అన్న ప్రచారం మొదలైంది.
కానీ చిత్ర బృందం వెనక్కి తగ్గే అవకాశమే లేదని తెలుస్తోంది. ఈ విషయమై స్వయంగా రాజమౌళే స్పష్టత ఇచ్చేశాడు. ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ కమ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్పై క్లారిటీ ఇచ్చాడు. ఎక్స్క్లూజివ్ న్యూస్గా పేర్కొంటూ ‘ఆర్ఆర్ఆర్’ అనుకున్నట్లే జనవరి 7న విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజమౌళికి తాను ఫోన్ చేశానని.. వాయిదాకు ఆస్కారమే లేదని, అనుకున్న ప్రకారమే సినిమా రిలీజవుతుందని ఆయన స్పష్టత ఇచ్చారని, కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ 7న వచ్చే విషయంలో సందేహాలేమీ పెట్టుకోవద్దని ఆయన తేల్చేశాడు.
ఈ రోజు కేరళలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఆ వేడుకకు కేరళ ముఖ్యమంత్రి కూడా రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో ఎంతమాత్రం తగ్గట్లేదంటే విడుదల విషయంలోనూ తగ్గనట్లే. ఢిల్లీలోనో, ఇంకో ఏరియాలోనో వసూళ్లకు కోత పడుతుందని.. ఈ దశలో సినిమా రిలీజ్ వేయడం కరెక్ట్ కాదని, దాని వల్ల తీవ్ర ఇబ్బందులు తప్పవని భావించే విడుదల విషయంలో ముందుకెళ్లిపోవాలనే డిసైడైనట్లుంది రాజమౌళి టీం.
This post was last modified on December 29, 2021 7:23 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…