Movie News

బాలీవుడ్ లో ‘అఖండ’.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో హిట్ అయిన చాలా సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తే.. భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రెండొందల కోట్లు రాబట్టింది. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్లబోతుందని సమాచారం. కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు వస్తుండగా.. తాజాగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్ లో ‘అఖండ’ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ రీమేక్ చేస్తే.. అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ నటిస్తే బాగుంటుందని అన్నారు. అంతేకాదు.. ‘అఖండ 2’ సినిమాకి కూడా స్కోప్ ఉందని అన్నారు. ‘అఖండ 2’ వస్తే బాగుంటుందని.. కానీ బోయపాటి శ్రీను మైండ్ లో ఏముందో తెలియదని అన్నారు.

ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే బయ్యర్లు లాభాల బాట పడతారనే విషయం తనకు ముందే తెలుసునని.. అలానే అయిందని చెప్పారు. కానీ ఓవర్సీస్ లో ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పారు. బాలకృష్ణ లాంటి హీరోతో పని చేయడం గొప్ప అవకాశమని.. ఫ్యూచర్ లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుందని అన్నారు.

రీసెంట్ గానే ‘అఖండ’ సినిమా 25 రోజుల సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. చాలా కాలం తరువాత ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నారు.

This post was last modified on December 29, 2021 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

3 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago