ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో హిట్ అయిన చాలా సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇక్కడ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేస్తే.. భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు రెండొందల కోట్లు రాబట్టింది. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాను కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు బాలయ్య నటించిన ‘అఖండ’ సినిమా కూడా బాలీవుడ్ కి వెళ్లబోతుందని సమాచారం. కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు వస్తుండగా.. తాజాగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ లో ‘అఖండ’ సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ రీమేక్ చేస్తే.. అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ నటిస్తే బాగుంటుందని అన్నారు. అంతేకాదు.. ‘అఖండ 2’ సినిమాకి కూడా స్కోప్ ఉందని అన్నారు. ‘అఖండ 2’ వస్తే బాగుంటుందని.. కానీ బోయపాటి శ్రీను మైండ్ లో ఏముందో తెలియదని అన్నారు.
ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే బయ్యర్లు లాభాల బాట పడతారనే విషయం తనకు ముందే తెలుసునని.. అలానే అయిందని చెప్పారు. కానీ ఓవర్సీస్ లో ఇంతటి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని చెప్పారు. బాలకృష్ణ లాంటి హీరోతో పని చేయడం గొప్ప అవకాశమని.. ఫ్యూచర్ లో ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుందని అన్నారు.
రీసెంట్ గానే ‘అఖండ’ సినిమా 25 రోజుల సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. చాలా కాలం తరువాత ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నారు.
This post was last modified on December 29, 2021 11:19 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…