అల్లు అర్జున్, సుకుమార్ల అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బన్నీని స్టార్ను చేసిన సినిమా, సుకుమార్కు దర్శకుడిగా జీవితాన్నిచ్చిన సినిమా ఒక్కటే. అదే.. ఆర్య. అందుకే ఒకరిపై ఒకరికి కృతజ్ఞతా భావం ఉంది. ఆ సినిమాతో మొదలైన స్నేహం గొప్ప అనుబంధానికి దారి తీసింది. అందుకే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడేటపుడు ఆ ప్రేమ అంతా కనిపిస్తుంటుంది.
ముఖ్యంగా బన్నీ.. సుకుమార్ పేరెత్తితే చాలు.. కొంత ఎమోషనల్ కూడా అవుతుంటాడు. తాజాగా వీరి కలయికలో వచ్చిన పుష్ప మూవీ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే రాబట్టుకుంటోంది. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో బన్నీ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అతడి మాటలు విని సుకుమార్ కన్నీళ్లు పెట్టుకోగా.. అది చూసి బన్నీ కూడా ఏడ్చేయడం గమనార్హం.
తాను కెరీర్లో ఈ స్థాయిలో ఉండటానికి ముందుగా తన తాతయ్య అల్లు రామలింగయ్యకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ఆయనే వచ్చి ఇండస్ట్రీలో స్థిరపడకపోయి ఉంటే ఇప్పుడు తాను ఇక్కడ ఉండేవాణ్ని కాదని బన్నీ అన్నాడు. ఇక ఆ తర్వాత కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకని.. ఆ తర్వాత తన కెరీర్ ఆరంభం నుంచి మద్దతుగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవికి తాను కృతజ్ఞుడినని బన్నీ అన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానం సుకుమార్కే అని, ఆర్య సినిమాతో తన కెరీర్కు టేకాఫ్ ఇచ్చింది ఆయనే అని బన్నీ చెప్పాడు.
ఈ సందర్భంగా అతనో సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఆర్య రిలీజైన నాలుగైదేళ్లకు తాను పరుగు సినిమా చేస్తున్న సమయంలో ఒక స్పోర్ట్స్ కారు కొన్నానని, దాని రేటు రూ.85 లక్షలని, ఆ కార్లో కూర్చుని స్టీరింగ్ మీద చేయి వేసినపుడు తాను ఇప్పుడీ స్థాయిలో ఉండటానికి ఎవరు కారణం అని ఆలోచిస్తే ముందు తట్టిన పేరు సుకుమార్దే అని అన్నాడు. ఈ మాటకు సుక్కు ఉద్వేగానికి గురయ్యాడు. చేతుల్లో ముఖం పెట్టుకుని ఏడ్చేశాడు. అది చూసి బన్నీ సైతం స్టేజ్ మీద ఏడ్చేసి కన్నీళ్లను కర్చీఫ్తో తుడుచుకున్నాడు.
This post was last modified on December 28, 2021 8:54 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…