Movie News

సీఎంతోనే తేల్చుకుంటాం.. దిల్ రాజు

ఆంధ్రప్రదేశ్లోని పదుల సంఖ్యలో సినిమా థియేటర్లు మూసివేత, టికెట్ రేట్లలో తగ్గింపు గురించి గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయమై పలువురు నటీనటులు స్పందిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పులేదు. నిర్మాత దిల్రాజు తాజాగా ప్రెస్మీట్లో దీని గురించి మాట్లాడారు. త్వరలో ఏపీ సీఎం జగన్ను కలుస్తామని చెప్పారు. “ఏపీకి అస‌లు స‌మ‌స్య ఏంటో అర్ధం కావ‌డం లేదు. మేం రాజ‌కీయ నేత‌లం కాదు. ఏ ప్ర‌భుత్వంతోనైనా.. మాప‌రిధిమేర‌కే మేం సంబంధం పెట్టుకుంటాం. ఎవ‌రినీ భుజాన వేసుకునే ప్ర‌స‌క్తి లేదు. అలాగ‌ని వైరం కూడా ఉండ‌దు. కానీ, ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తే.. ఆవేద‌న ఆందోళ‌న కూడా క‌లుగుతోంది“ అని అన్నారు.

“త్వరలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తాం. అపాయింట్మెంట్ ఇస్తే ఏపీ సీఎం జగన్ను కలుస్తాం. కమిటీ ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం సులువవుతుంది. ఎవరూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని మనవి. ముందుగా అసలు సమస్యలు ఏంటో చర్చిస్తాం. సమస్యలపై ఏపీ సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. మావి పెద్ద పెద్ద సమస్యలు కావు. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందిచాలనేదే మా లక్ష్యం. సినీ పరిశ్రమను వివాదాస్పదం చేయొద్దని కోరుతున్నాం. పెద్ద సినిమాలు విడుదల చేయాల్సిందే. సినిమా విడుదలలలో కష్టమైనా, నష్టమైనా ముందుకే వెళ్లాలి” అని దిల్రాజు చెప్పారు.

ఏపీలో థియేటర్, టికెట్ రేట్ల విషయమై త్వరలో ఏపీ సీఎం జగన్ను కలుస్తామని నిర్మాత దిల్రాజు అన్నారు. ఏది ఏమైనా భారీ సినిమాలు విడుదలవుతాయని స్పష్టం చేశారు. అదేస‌మ‌యంలో టాలీవుడ్‌లో ఎవ‌రి స‌మ‌స్య‌లు వారివేన‌ని.. ఎవ‌రి సినిమా ఆగిపోతే.. వారికిబాధ క‌లుగుతోంద‌ని.. ప‌క్క‌వారి సినిమా ఆగిపోతే.. మాత్రం ఎవ‌రికీ బాధ ఉండ‌డం లేద‌ని.. విమ‌ర్శించారు.

అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉంటేనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని.. న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. సినిమా రంగంపై సానుకూలంగానే ఉంద‌ని.. ఎలాంటి వివ‌క్ష చూపించ‌డం లేద‌ని.. ఈ విష‌యంలో మీడియా కూడా సినిమా రంగానికి స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఎవ‌రూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లుచేయొద్ద‌ని.. ముఖ్యంగా ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించ‌డం స‌రికాద‌ని.. ఏదైనా స‌మ‌స్య ఉంటే చ‌ర్చించి ప‌రిష్క‌రించుకుందామ‌ని.. ప‌లువురు హీరోల‌కు సూచించారు.

This post was last modified on December 28, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago