టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఒంగోలు ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరులు అనే వ్యక్తికి బండ్ల గణేష్ రూ.1 కోటి 25 లక్షల చెక్ ను ఇచ్చారట. ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో.. వెంటనే జెట్టి వెంకటేశ్వరులు కోర్టుని ఆశ్రయించారు.
విచారణకు హాజరు కావాలంటూ బండ్ల గణేష్ కి పలుమార్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. ఆయన మాత్రం స్పందించలేదట. దీంతో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు జడ్జి బండ్ల గణేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం బండ్ల గణేష్ కి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి కేసులోనే పోలీసులు బండ్ల గణేష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
గతంలో కడప జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర కోటి ముప్పై లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదు. దీంతో మహేష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టులో విచారణకు హాజరు కావాలని చెప్పినా.. బండ్ల గణేష్ వినకపోవడంతో కడపజిల్లా మెజిస్ట్రేట్ బండ్ల గణేష్పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు మరోసారి బండ్ల గణేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో ‘డేగల బాబ్జీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…