రీసెంట్ గా విడుదలైన ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలైన తరువాతే బాలయ్య మరో సినిమా మొదలుపెడతారు. అంటే.. ఆయనతో సినిమా తీయాలనుకుంటున్న అనిల్ రావిపూడికి ఇంకా గ్యాప్ పెరుగుతుందన్నమాట. ఇప్పటికే బాలయ్యతో కథ ఒకే చేయించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ షూటింగ్ మాత్రం ముందే పూర్తవుతుంది.
ఆ తరువాత దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అప్పటివరకు బాలయ్య కోసం ఎదురుచూడక తప్పదు. ‘అఖండ’ సినిమా తరువాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన నుంచి భారీ యాక్షన్ ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా తన స్క్రీన్ ప్లే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు అనిల్ తీసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ కథలే. కానీ బాలయ్యతో తీసేది అలాంటి కథ కాదని.. పక్కా మాస్ ఫిల్మ్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. బాలయ్యను బోయపాటి ఎంత కొత్తగా చూపించారో.. తాను కూడా అలా చూపించడానికి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
This post was last modified on December 26, 2021 9:58 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…