రీసెంట్ గా విడుదలైన ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలైన తరువాతే బాలయ్య మరో సినిమా మొదలుపెడతారు. అంటే.. ఆయనతో సినిమా తీయాలనుకుంటున్న అనిల్ రావిపూడికి ఇంకా గ్యాప్ పెరుగుతుందన్నమాట. ఇప్పటికే బాలయ్యతో కథ ఒకే చేయించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ షూటింగ్ మాత్రం ముందే పూర్తవుతుంది.
ఆ తరువాత దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అప్పటివరకు బాలయ్య కోసం ఎదురుచూడక తప్పదు. ‘అఖండ’ సినిమా తరువాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన నుంచి భారీ యాక్షన్ ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా తన స్క్రీన్ ప్లే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు అనిల్ తీసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ కథలే. కానీ బాలయ్యతో తీసేది అలాంటి కథ కాదని.. పక్కా మాస్ ఫిల్మ్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. బాలయ్యను బోయపాటి ఎంత కొత్తగా చూపించారో.. తాను కూడా అలా చూపించడానికి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…