రీసెంట్ గా విడుదలైన ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలైన తరువాతే బాలయ్య మరో సినిమా మొదలుపెడతారు. అంటే.. ఆయనతో సినిమా తీయాలనుకుంటున్న అనిల్ రావిపూడికి ఇంకా గ్యాప్ పెరుగుతుందన్నమాట. ఇప్పటికే బాలయ్యతో కథ ఒకే చేయించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ షూటింగ్ మాత్రం ముందే పూర్తవుతుంది.
ఆ తరువాత దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అప్పటివరకు బాలయ్య కోసం ఎదురుచూడక తప్పదు. ‘అఖండ’ సినిమా తరువాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన నుంచి భారీ యాక్షన్ ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా తన స్క్రీన్ ప్లే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు అనిల్ తీసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ కథలే. కానీ బాలయ్యతో తీసేది అలాంటి కథ కాదని.. పక్కా మాస్ ఫిల్మ్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. బాలయ్యను బోయపాటి ఎంత కొత్తగా చూపించారో.. తాను కూడా అలా చూపించడానికి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
This post was last modified on December 26, 2021 9:58 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…