రీసెంట్ గా విడుదలైన ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో మరో హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి.. 2022 దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమా విడుదలైన తరువాతే బాలయ్య మరో సినిమా మొదలుపెడతారు. అంటే.. ఆయనతో సినిమా తీయాలనుకుంటున్న అనిల్ రావిపూడికి ఇంకా గ్యాప్ పెరుగుతుందన్నమాట. ఇప్పటికే బాలయ్యతో కథ ఒకే చేయించుకున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ షూటింగ్ మాత్రం ముందే పూర్తవుతుంది.
ఆ తరువాత దాదాపు తొమ్మిది నెలల పాటు ఆయన ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. అప్పటివరకు బాలయ్య కోసం ఎదురుచూడక తప్పదు. ‘అఖండ’ సినిమా తరువాత బాలయ్య రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆయన నుంచి భారీ యాక్షన్ ఆశిస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి అనిల్ రావిపూడి కూడా తన స్క్రీన్ ప్లే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు అనిల్ తీసిన సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ కథలే. కానీ బాలయ్యతో తీసేది అలాంటి కథ కాదని.. పక్కా మాస్ ఫిల్మ్ అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపూడి. బాలయ్యను బోయపాటి ఎంత కొత్తగా చూపించారో.. తాను కూడా అలా చూపించడానికి వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
This post was last modified on December 26, 2021 9:58 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…