Movie News

వెబ్ సిరీస్ గా ‘కన్యాశుల్కం’!

ఒకప్పుడు నవలల ఆధారంగా సినిమాలు వచ్చేవి. కానీ ఆ తరువాత నవలల కాన్సెప్ట్ ని పక్కన పెట్టేశారు. ఇప్పుడిప్పుడే మళ్లీ నవలల్ని సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ తీసిన ‘కొండపొలం’ సినిమా సినిమా నవల ఆధారంగా తెరకెక్కించిందే. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కానప్పటికీ.. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు క్రిష్ అలాంటి ప్రయత్నమే మరొకటి చేస్తున్నాడు.

ఈసారి ఆయన ‘కన్యాశుల్కం’ కాన్సెప్ట్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సాహిత్యంలో ఈ నవలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గురజాడ అప్పారావు రాసిన ఈ నవల నాటకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో పాత్రలన్నీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. డైలాగులను కూడా గుర్తుపెట్టుకునే వారున్నారు. ఈ నవల అంత ఫేమస్.

ఇప్పుడు దీన్ని వెబ్ సిరీస్ గా తెరకెక్కించబోతున్నారు క్రిష్. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ కోసం ‘కన్యాశుల్కం’ని వెబ్ సిరీస్ గా తీయబోతున్నారు క్రిష్. రచన, దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం ఆయన చేయబోతున్నారు. దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి అప్పగించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే ఫ్యూచర్ లో మరిన్ని నవలలు వెబ్ సిరీస్ లుగా వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. కొత్త షెడ్యూల్ ను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టనున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ రామ్ పాల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

This post was last modified on December 26, 2021 6:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

48 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago