‘బాహుబలి’ కోసం ఐదేళ్లకు పైగా సమయాన్ని వెచ్చించాడు ప్రభాస్. దీని తర్వాత వేగంగా సినిమాలు చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. ‘సాహో’ కోసం రెండేళ్లకు పైగానే సమయం పెట్టాల్సి వచ్చింది. ‘రాధేశ్యామ్’ను అయినా ఫాస్ట్గా చేయాలనుకుంటే.. కరోనా, ఇతర కారణాలతో ఆ సినిమా సైతం ఆలస్యమైంది.
ముందు అనుకున్న ప్రకారం అయితే గత ఏడాదే ‘రాధేశ్యామ్’ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదాలు పడి.. చివరికి 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే ఈ సినిమా 2022లోనే విడుదలవుతుందని కొన్నేళ్ల ముందే జ్యోతిష్యులు చెప్పారట. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణకుమార్ వెల్లడించడం విశేషం.
‘రాధేశ్యామ్’ కథ జ్యోతిష్యం చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధునిక జ్యోతిష్యుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్రను తీర్చిదిద్దే క్రమంలో రాధాకృష్ణ కుమార్.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిష్యుల్ని కలిశాడట.
అందులో ఒకరు కొన్నేళ్ల ముందే.. ఈ చిత్రం 2022లో విడుదల అవుతుందని చెప్పారట. అప్పుడు తాను నమ్మలేదని, చివరికి ఈ చిత్రం ఆయనన్నట్లే 2022లో విడుదలవుతోందని రాధాకృష్ణ కుమార్ తెలిపాడు. జ్యోతిష్యం, విధికి సంబంధించి వేల సంవత్సరాల నుంచి అనేక ప్రశ్నలు ఉన్నాయని.. ఐతే ఈ చిత్రంలో తాను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదని.. కానీ ఆ ప్రశ్నలకు తన వివరణ మాత్రం ఇవ్వబోతున్నానని రాధాకృష్ణ తెలిపాడు.
‘రాధేశ్యామ్’ సినిమా ట్రైలర్ చూసి చాలామంది విజువల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నారని.. ఆ క్రెడిట్ అంతా కమల్ కణ్ణన్ టీంకే చెందుతుందని.. ఈ సినిమా వీఎఫెక్స్ పనులు 12 దేశాల్లో జరుగుతున్నాయని రాధాకృష్ణ వెల్లడించాడు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…