నరసింహనాయుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్లో హైస్ అని చెప్పుకోవాలంటే బోయపాటి శ్రీనుతో చేసిన సింహా, లెజెండ్ మాత్రమే. మిగతా సినిమాల్లో మెజారిటీ డిజాస్టర్లే. ఒకటీ అరా ఓ మోస్తరుగా ఆడాయంతే. అసలు వరుస డిజాస్టర్లతో బాలయ్య కెరీర్ దారుణంగా దెబ్బ తిన్న సమయంలో సింహాతో మళ్లీ నందమూరి హీరోను బోయపాటి ఎలా పైకి లేపాడో తెలిసిందే. లెజెండ్తో మరోసారి బాలయ్యకు లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడీ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఐతే ఆ అంచనాల్ని మరో స్థాయికి తీసుకెళ్లింది మంగళవారం సాయంత్రం రిలీజ్ చేసిన ఫస్ట్ రోర్ టీజర్. గత ఏడాది రూలర్ సినిమా సమయానికి బాలయ్య మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో, ఆయన క్రేజ్ ఎలా పడిపోయిందో తెలిసిందే. బాలయ్య ఇక సినిమాలు మానుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఐతే బోయపాటితో మళ్లీ బాలయ్య సినిమా అనేసరికి అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ఈ రోజు టీజర్ చూశాక అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకుల్లోనూ సినిమాపై క్రేజ్ వచ్చేసిందన్నది స్పష్టం. కాంబినేషన్ క్రేజ్కు తగ్గట్లే టీజర్ తయారైంది. ఈ టీజర్ రావడం ఆలస్యం.. సోషల్ మీడియా షేకైపోయింది. ట్విట్టర్లో ఒక్కసారిగా టాప్ ట్రెండ్స్ లిస్టును బాలయ్య ఆక్రమించేశాడు. హ్యాపీ బర్త్ డే ఎన్బీకే, బీబీ3 ఫస్ట్ రోర్, ఎన్బీకే 106.. ఈ మూడు హ్యాష్ ట్యాగ్స్ ఇండియా లెవెల్లో టాప్లో ట్రెండ్ అవడం మొదలైంది. హైదరాబాద్ స్థాయిలో అయితే ఇవే తొలి మూడు స్థానాల్ని ఆక్రమించాయి. సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ కొంచెం వీక్ అనుకుంటాం కానీ.. టీజర్ లాంచ్ అవ్వగానే అందరూ యాక్టివ్ అయిపోయారు. ఈ ఒక్క టీజర్తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమాకు ఈజీగా బిజినెస్ అయ్యే పరిస్థితి వచ్చేసిందంటే కూడా అతిశయోక్తి కాదు.
This post was last modified on June 9, 2020 10:58 pm
అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో…
టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఇటీవల పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలతోపాటు.. పొలిట్ బ్యూరోను…
మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…
కేరళంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందా? అంటే.. ఔననే అంటు న్నాయి……
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ తన పట్టును వరుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోందని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.…
దీదీనా-మోదీనా నినాదంతో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో మోదీదే పైచేయి అని బీజేపీనే విజయం దక్కించు కుంటుందని…