‘బాహుబలి’ తర్వాత రాజమౌళి అంతే భారీ స్థాయిలో తెరకెక్కించిన తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకో రెండు వారాలు కూడా సమయం లేదు. ఈ సినిమాకు ఆల్రెడీ ఓవర్సీస్లో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. వారం కిందట్నుంచే బుకింగ్స్ నడుస్తున్నాయి. విడుదలకు రెండు వారాల సమయం ఉండగానే, ప్రి సేల్స్తోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఓవర్సీస్లో భారీ స్థాయిలో థియేటర్లు కూడా ఖరారయ్యాయి.
దాదాపుగా అన్ని థియేటర్లకూ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సినిమాకు థియేటర్ల బుకింగ్ పూర్తయింది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవు కాబోతున్నాయి. చిత్ర బృందం ఇండియాలో వివిధ ప్రాంతాల్లో తిరిగేస్తూ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తోంది కూడా. అంతా బాగుంది కానీ.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఈ టైంలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్పై సందేహాలు నెలకొంటున్నాయి.
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మళ్లీ ఆంక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కర్ణాటక ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కూడా ఆంక్షలు పెడుతున్నారు. కాకపోతే ఇంకా నైట్ షోలు రద్దు చేయలేదు. క్రిస్మస్ వీకెండ్లో సినీ వినోదానికి బ్రేక్ వేయకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి వేచి చూసే దోరణలో వ్యవహరిస్తున్నాయి రాష్ట్రాలు.
కానీ వచ్చే వారం నుంచి ఆంక్షలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో నైట్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అని వార్తలొస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టొచ్చు. ఇదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’కు ఇబ్బంది తప్పదు. నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో, రెగ్యులర్ షోలన్నీ పడితే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి వర్కవుట్ కాదు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత పెరిగి, ఆంక్షలు మొదలైతే ‘ఆర్ఆర్ఆర్’ను చివరి నిమిషంలో వాయిదా వేసే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on December 25, 2021 3:13 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…