‘బాహుబలి’ తర్వాత రాజమౌళి అంతే భారీ స్థాయిలో తెరకెక్కించిన తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకో రెండు వారాలు కూడా సమయం లేదు. ఈ సినిమాకు ఆల్రెడీ ఓవర్సీస్లో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. వారం కిందట్నుంచే బుకింగ్స్ నడుస్తున్నాయి. విడుదలకు రెండు వారాల సమయం ఉండగానే, ప్రి సేల్స్తోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఓవర్సీస్లో భారీ స్థాయిలో థియేటర్లు కూడా ఖరారయ్యాయి.
దాదాపుగా అన్ని థియేటర్లకూ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సినిమాకు థియేటర్ల బుకింగ్ పూర్తయింది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవు కాబోతున్నాయి. చిత్ర బృందం ఇండియాలో వివిధ ప్రాంతాల్లో తిరిగేస్తూ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తోంది కూడా. అంతా బాగుంది కానీ.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఈ టైంలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్పై సందేహాలు నెలకొంటున్నాయి.
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మళ్లీ ఆంక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కర్ణాటక ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కూడా ఆంక్షలు పెడుతున్నారు. కాకపోతే ఇంకా నైట్ షోలు రద్దు చేయలేదు. క్రిస్మస్ వీకెండ్లో సినీ వినోదానికి బ్రేక్ వేయకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి వేచి చూసే దోరణలో వ్యవహరిస్తున్నాయి రాష్ట్రాలు.
కానీ వచ్చే వారం నుంచి ఆంక్షలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో నైట్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అని వార్తలొస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టొచ్చు. ఇదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’కు ఇబ్బంది తప్పదు. నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో, రెగ్యులర్ షోలన్నీ పడితే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి వర్కవుట్ కాదు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత పెరిగి, ఆంక్షలు మొదలైతే ‘ఆర్ఆర్ఆర్’ను చివరి నిమిషంలో వాయిదా వేసే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on December 25, 2021 3:13 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…