‘బాహుబలి’ తర్వాత రాజమౌళి అంతే భారీ స్థాయిలో తెరకెక్కించిన తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకో రెండు వారాలు కూడా సమయం లేదు. ఈ సినిమాకు ఆల్రెడీ ఓవర్సీస్లో బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. వారం కిందట్నుంచే బుకింగ్స్ నడుస్తున్నాయి. విడుదలకు రెండు వారాల సమయం ఉండగానే, ప్రి సేల్స్తోనే ఈ చిత్రం మిలియన్ డాలర్ల మార్కును కూడా దాటేసింది. ఓవర్సీస్లో భారీ స్థాయిలో థియేటర్లు కూడా ఖరారయ్యాయి.
దాదాపుగా అన్ని థియేటర్లకూ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సినిమాకు థియేటర్ల బుకింగ్ పూర్తయింది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవు కాబోతున్నాయి. చిత్ర బృందం ఇండియాలో వివిధ ప్రాంతాల్లో తిరిగేస్తూ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తోంది కూడా. అంతా బాగుంది కానీ.. విడుదలకు సమయం దగ్గర పడుతున్న ఈ టైంలో మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్పై సందేహాలు నెలకొంటున్నాయి.
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో మళ్లీ ఆంక్షలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. కర్ణాటక ఆల్రెడీ నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కూడా ఆంక్షలు పెడుతున్నారు. కాకపోతే ఇంకా నైట్ షోలు రద్దు చేయలేదు. క్రిస్మస్ వీకెండ్లో సినీ వినోదానికి బ్రేక్ వేయకూడదన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి వేచి చూసే దోరణలో వ్యవహరిస్తున్నాయి రాష్ట్రాలు.
కానీ వచ్చే వారం నుంచి ఆంక్షలు తప్పకపోవచ్చని అంటున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో నైట్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే అని వార్తలొస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇదే బాట పట్టొచ్చు. ఇదే జరిగితే ‘ఆర్ఆర్ఆర్’కు ఇబ్బంది తప్పదు. నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో, రెగ్యులర్ షోలన్నీ పడితే తప్ప ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి వర్కవుట్ కాదు. ఈ నేపథ్యంలో కరోనా తీవ్రత పెరిగి, ఆంక్షలు మొదలైతే ‘ఆర్ఆర్ఆర్’ను చివరి నిమిషంలో వాయిదా వేసే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on December 25, 2021 3:13 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…