Movie News

AP బిగ్గెస్ట్ థియేటర్ మూసేశారు

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల వ్యవహారం థియేటర్ వ్యవస్థను దారుణంగా దెబ్బ తీస్తోంది. అసలే కరోనా దెబ్బకు ఆ ఇండస్ట్రీ విలవిలలాడి పోయింది. దేశంలోనే కాక ప్రపంచంలోనే కరోనా మహమ్మారి వల్ల థియేటర్ ఇండస్ట్రీ అంత దెబ్బ తిన్న పరిశ్రమ మరొకటి కనిపించదు. ఆ వ్యవస్థను నమ్ముకున్న కోట్లాది మంది సంక్షోభంలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల సంఖ్య బాగా ఎక్కువ. వాటిని నమ్ముకుని వేలాది కుటుంబాలున్నాయి.

యాజమాన్య స్థాయిలో ఉన్న వారు తట్టుకుంటారు కానీ.. వాటిలో వివిధ రకాల పనులు, బాధ్యతలు నిర్వర్తించే వారి పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. కరోనా దెబ్బను తట్టుకుని అతి కష్టం మీద నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న థియేటర్ల వ్యవస్థకు ఇప్పుడు టికెట్ల రేట్ల నియంత్రణ పెద్ద సమస్యగా మారింది. పెద్ద నగరాల వరకు ఓకే కానీ.. తర్వాతి స్థాయలో ఉండే టికెట్ల రేట్లు బాగా తగ్గిపోవడంతో థియేటర్ల మెయింటైనెన్స్ చాలా కష్టంగా మారిపోయింది.

ఏపీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన, ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్లలో ఒకటిగా పేరొందిన ‘వి ఎపిక్’ థియేటరే జగన్ సర్కారు దెబ్బకు తట్టుకోలేక మూత పడే పరిస్థితికి వచ్చింది. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో రెండేళ్ల కిందట ‘సాహో’ సినిమాతో యువి క్రియేషన్స్ వాళ్లు ఈ మెగా థియేటర్‌ను ఓపెన్ చేశారు. ఇందులో ఒక తెర ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్లలో ఒకటిగా రికార్డులకెక్కింది. సూళ్లూరు పేట లాంటి చిన్న టౌన్లో ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటవడం ఆ ప్రాంత వాసులకు గర్వకారణమే.

ఇక్కడ సినిమా చూసేందుకు చాలా దూరం నుంచి జనాలు వస్తుంటారు. .పెద్ద సినిమాలు రిలీజైనపుడు సందడి మామూలుగా ఉండదు. ఐతే ఏపీ సర్కారు నిబంధనల ప్రకారం ఇక్కడ రూ.30 రేటుతో టికెట్లు అమ్మాలట. అధునాతన టెక్నాలజీ, సౌకర్యాలతో ఏర్పాటైన థియేటర్లో 30 రూపాయలతో టికెట్లు అమ్మి మనుగడ సాగించడం చాలా చాలా కష్టం. మెయింటైెనెన్స్ కూడా కష్టమైపోతోంది. దీంతో ఇక తమ వల్ల కాదంటూ యువి వాళ్లు ఆ థియేటర్‌ను మూసేయడం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద షాక్. ఇలాంటి పరిణామాలు చూసి అయినా జగన్ సర్కారు కరుగుతుందా అన్నది సందేహంగానే ఉంది.

This post was last modified on December 25, 2021 1:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

2 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

3 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

5 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

6 hours ago