బాహుబలి దగ్గర్నుంచి ప్రభాస్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండట్లేదు. అతను ఆషామాషీ సినిమాలు చేస్తే అభిమానులు ఒప్పుకునే పరిస్థితి లేదు. అతడి ఇమేజ్కు తగ్గట్లుగా తెరపై అద్భుతాలను ఆవిష్కరించాల్సిందే. బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమాలో యాక్షన్ పరంగా గట్టిగానే ట్రై చేశారు కానీ.. ఆసక్తికరమైన కథాకథనాలు లేకపోవడంతో ఆ చిత్రం ప్రభాస్ అభిమానులనే కాక అందరినీ నిరాశకు గురి చేసింది.
ఇప్పుడిక ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ రాధేశ్యామ్ మీదే ఉన్నాయి. ఈ చిత్రమైనా ప్రభాస్ ఇమేజ్ను మ్యాచ్ చేసేలా ఉంటుందేమో అని చూస్తున్నారు. కానీ ట్రైలర్ చూశాక వారి నుంచి ఒకింత నిరాశే వ్యక్తమవుతోంది. దీంతో పోలిస్తే సాహోనే బెటర్ అనే అభిప్రాయం మెజారిటీ ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అందుక్కారణం అందులో హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు ఒక రేంజిలో ఉండటమే కారణం.
రాధేశ్యామ్ విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ నుంచి కోరుకునే ఎలివేషన్లేమీ ఉండేలా కనిపించడం లేదు. ఇది యాక్షన్ సినిమా కాదు. క్లాస్ టచ్ ఉన్న పక్కా లవ్ స్టోరీ అనే సంకేతాలు ముందు నుంచే వస్తున్నాయి. అయినప్పటికీ.. ఎంతో కొంత హీరో ఎలివేషన్ ఉంటుందనుకున్నారు. కొన్ని హై మూమెంట్స్ ఆశించారు. ట్రైలర్లో అలాంటి విశేషాలు తప్పక ఉంటాయన్న ఆశతో ఎదురు చూశారు. కానీ ట్రైలర్లో అలాంటి మెరుపులేమీ కనిపించలేదు. హీరోను జ్యోతిషుడిగా చూపించి ప్రపంచంలోనే అతడిలాంటి ఆస్ట్రాలజర్ లేడు అంటే అభిమానులకు ఏం కిక్కుంటుంది.
గాఢమైన ప్రేమకథను ఎమోషన్లతో.. పూర్తి క్లాస్గా చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు రాధాకృష్ణకుమార్. ఈ స్టైల్ నరేషన్ మాస్కు అస్సలు రుచించదు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ చూస్తేనే చాలా మందికి ల్యాగ్ అనిపించింది. మరి ప్రభాస్ సినిమాలో హీరో ఎలివేషన్లు, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలు ఏమీ లేకుండా ఇలాంటి కథతో, నరేషన్తో ఇలాంటి నరేషన్తో రెండున్నరమూడు గంటల సినిమా అంటే ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఏమో?
This post was last modified on December 24, 2021 9:44 am
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…