బాహుబలి దగ్గర్నుంచి ప్రభాస్ సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండట్లేదు. అతను ఆషామాషీ సినిమాలు చేస్తే అభిమానులు ఒప్పుకునే పరిస్థితి లేదు. అతడి ఇమేజ్కు తగ్గట్లుగా తెరపై అద్భుతాలను ఆవిష్కరించాల్సిందే. బాహుబలి తర్వాత చేసిన సాహో సినిమాలో యాక్షన్ పరంగా గట్టిగానే ట్రై చేశారు కానీ.. ఆసక్తికరమైన కథాకథనాలు లేకపోవడంతో ఆ చిత్రం ప్రభాస్ అభిమానులనే కాక అందరినీ నిరాశకు గురి చేసింది.
ఇప్పుడిక ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ రాధేశ్యామ్ మీదే ఉన్నాయి. ఈ చిత్రమైనా ప్రభాస్ ఇమేజ్ను మ్యాచ్ చేసేలా ఉంటుందేమో అని చూస్తున్నారు. కానీ ట్రైలర్ చూశాక వారి నుంచి ఒకింత నిరాశే వ్యక్తమవుతోంది. దీంతో పోలిస్తే సాహోనే బెటర్ అనే అభిప్రాయం మెజారిటీ ప్రభాస్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అందుక్కారణం అందులో హీరో ఎలివేషన్లు, యాక్షన్ ఘట్టాలు ఒక రేంజిలో ఉండటమే కారణం.
రాధేశ్యామ్ విషయానికి వస్తే ఇందులో ప్రభాస్ నుంచి కోరుకునే ఎలివేషన్లేమీ ఉండేలా కనిపించడం లేదు. ఇది యాక్షన్ సినిమా కాదు. క్లాస్ టచ్ ఉన్న పక్కా లవ్ స్టోరీ అనే సంకేతాలు ముందు నుంచే వస్తున్నాయి. అయినప్పటికీ.. ఎంతో కొంత హీరో ఎలివేషన్ ఉంటుందనుకున్నారు. కొన్ని హై మూమెంట్స్ ఆశించారు. ట్రైలర్లో అలాంటి విశేషాలు తప్పక ఉంటాయన్న ఆశతో ఎదురు చూశారు. కానీ ట్రైలర్లో అలాంటి మెరుపులేమీ కనిపించలేదు. హీరోను జ్యోతిషుడిగా చూపించి ప్రపంచంలోనే అతడిలాంటి ఆస్ట్రాలజర్ లేడు అంటే అభిమానులకు ఏం కిక్కుంటుంది.
గాఢమైన ప్రేమకథను ఎమోషన్లతో.. పూర్తి క్లాస్గా చెప్పే ప్రయత్నం చేసినట్లున్నాడు దర్శకుడు రాధాకృష్ణకుమార్. ఈ స్టైల్ నరేషన్ మాస్కు అస్సలు రుచించదు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ చూస్తేనే చాలా మందికి ల్యాగ్ అనిపించింది. మరి ప్రభాస్ సినిమాలో హీరో ఎలివేషన్లు, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలు ఏమీ లేకుండా ఇలాంటి కథతో, నరేషన్తో ఇలాంటి నరేషన్తో రెండున్నరమూడు గంటల సినిమా అంటే ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఏమో?
This post was last modified on December 24, 2021 9:44 am
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…