బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ‘ధోనీ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో రామ్ చరణ్ తో ‘వినయ్ విధేయ రామ’ సినిమా చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు.
దీంతో బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రెండొందల కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవలే ‘షేర్షా’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కియారా చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.
వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు, పార్టీలకు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తమ రిలేషన్ గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. త్వరలోనే తన లవ్ లైఫ్ గురించి పబ్లిక్ గా చెప్పాలని నిర్ణయించుకుందట కియారా అద్వానీ.
2022 న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి అభిమానులతో షేర్ చేసుకోబోతుంది కియారా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమ బంధాన్ని బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కియారా.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…