Movie News

హీరోతో రిలేషన్.. కన్ఫర్మ్ చేయనున్న కియారా!

బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ‘ధోనీ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో రామ్ చరణ్ తో ‘వినయ్ విధేయ రామ’ సినిమా చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు. 

దీంతో బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రెండొందల కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవలే ‘షేర్షా’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కియారా చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని  బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. 

వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు, పార్టీలకు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తమ రిలేషన్ గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. త్వరలోనే తన లవ్ లైఫ్ గురించి పబ్లిక్ గా చెప్పాలని నిర్ణయించుకుందట కియారా అద్వానీ. 

2022 న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి అభిమానులతో షేర్ చేసుకోబోతుంది కియారా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమ బంధాన్ని బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కియారా.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

This post was last modified on December 23, 2021 5:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago