బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ‘ధోనీ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో రామ్ చరణ్ తో ‘వినయ్ విధేయ రామ’ సినిమా చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు.
దీంతో బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రెండొందల కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవలే ‘షేర్షా’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కియారా చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.
వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు, పార్టీలకు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తమ రిలేషన్ గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. త్వరలోనే తన లవ్ లైఫ్ గురించి పబ్లిక్ గా చెప్పాలని నిర్ణయించుకుందట కియారా అద్వానీ.
2022 న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి అభిమానులతో షేర్ చేసుకోబోతుంది కియారా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమ బంధాన్ని బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కియారా.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on December 23, 2021 5:07 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…