బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ ‘ధోనీ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. యూత్ లో ఈమెకి ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ బిజీ అయింది. మధ్యలో రామ్ చరణ్ తో ‘వినయ్ విధేయ రామ’ సినిమా చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు.
దీంతో బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. ఆమె నటించిన ‘కబీర్ సింగ్’ సినిమా రెండొందల కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవలే ‘షేర్షా’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. కియారా చాలా కాలంగా నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.
వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు, పార్టీలకు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తమ రిలేషన్ గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు. త్వరలోనే తన లవ్ లైఫ్ గురించి పబ్లిక్ గా చెప్పాలని నిర్ణయించుకుందట కియారా అద్వానీ.
2022 న్యూ ఇయర్ సందర్భంగా సిద్ధార్థ్ తో ప్రేమాయణం గురించి అభిమానులతో షేర్ చేసుకోబోతుంది కియారా. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తమ బంధాన్ని బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కియారా.. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on December 23, 2021 5:07 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…