రామ్ గోపాల్ వర్మ పేరెత్తితే ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చిరాకు పడిపోయే పరిస్థితి ఎప్పుడో వచ్చేసింది. ఆయన సినిమాల క్వాలిటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభావితం చేసే క్లాసిక్స్ అందించిన ఆయన.. ఇప్పుడు మరీ నాసిరకం, బి-గ్రేడ్ సినిమాల స్థాయికి పడిపోవడం విచారకరం.
ఐతే దీని గురించి సినీ జనాలు, అభిమానులు, విశ్లేషకులు ఫీలవ్వాల్సిందే తప్ప వర్మకు కొంచెం కూడా రిగ్రెట్ లేదు. తాను చేస్తున్న సినిమాల పట్ల ఆయన చాలా సంతృప్తిగా ఉన్నాడు. ఎలాగోలా సినిమాను సేల్ చేసుకోవడమే ఆయన లక్ష్యంగా ఉంటోంది. ఈ లక్ష్యంతోనే ఈ మధ్య ‘క్లైమాక్స్’ అనే మరో పేలవమైన సినిమా తీశాడు. దాన్ని ఉన్నంతలో బాగానే సేల్ చేశాడు. రూ.100 రేటు పెట్టి తన పేరిటే పెట్టిన సొంత ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ చేసి కొన్ని కోట్లు ఖాతాలో వేసుకున్నాడు వర్మ.
ఆర్జీవీ లెక్కల్లో ‘క్లైమాక్స్’ సూపర్ హిట్టయింది. ఈ ఉత్సాహంతో ఆయన ‘నేక్డ్’ పేరుతో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అనౌన్స్మెంట్ రోజే ట్రైలర్ కూడా లాంచ్ చేశాడు. ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కోవాను తీసుకొచ్చిన వర్మ.. ఈసారి ఎవరో లోకల్ అమ్మాయితోనే ఈ సినిమా తీశాడు. దీని ట్రైలర్ కూడా లాంచ్ చేశాడు. అది వర్ణించతరం కాని విధంగా ఉంది. ఆ విజువల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘క్లైమాక్స్’ సినిమాకు 100 రూపాయల రేటే ఎక్కువనుకుంటే.. దీనికి ‘పే పవర్ వ్యూ’ కింద రూ.200 చెల్లించాలట. ఇది కూడా త్వరలోనే ఆర్జీవీ థియేటర్లోనే రిలీజవుతుందట. ఫారిన్ అమ్మాయిని చూడటానికి రూ.100 టికెట్ రేటు పెట్టి.. ఈసారి రూ.200 రేటు నిర్ణయించడానికి కారణం స్థానిక అమ్మాయిలపై తనకున్న ప్రత్యేక గౌరవమే కారణమంటూ తనదైన శైలిలో లాజిక్ తీశాడు వర్మ.
This post was last modified on June 9, 2020 4:47 pm
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండానే సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ… టీడీపీ…
విజనరీ ముఖ్యమంత్రిగా పేరున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా మరో కీలక లక్ష్యాన్ని ప్రకటించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో 20…
ఐపీఎల్ 2025 సీజన్ ఓ అద్భుతమైన మ్యాచ్తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది చెన్నై – ముంబై…
సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ ఉన్న అందాల భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఉత్తరాదికి దిశా పటాని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు మరోసారి వేతనాలు పెంచింది. రెండేళ్ల కిందట ఒకసారి…
ఏపీ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఇది అన్ని వర్గాల ప్రజల్లోనా.. లేక, కొందరిలోనేనా అనే విషయాన్ని పక్కన…