సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ అంటే ముందుగా.. యాంకర్ సుమని సంప్రదిస్తారు. అందులోనూ.. భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆమెకి రెమ్యునరేషన్ గా ఇచ్చి హోస్ట్ చేయిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీ జనాలపై పంచ్ లు, కౌంటర్లు వేసేంత ఫ్రీడమ్ యాంకర్లలో అంటే సుమకి మాత్రమే ఉంటుందని చెప్పాలి.
మిగిలిన వాళ్లు ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడతారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం సుమను తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈసారి ప్రభాస్ టీమ్ కొత్తగా ట్రై చేస్తుందట. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా ఫిక్స్ చేశారట.
ప్రభాస్ తో, యువి బ్యానర్ తో ఉన్న అనుబంధంతో నవీన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని నవీన్ పోలిశెట్టిని రంగంలోకి దింపారు. నవీన్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే.. తన పంచ్ లు, కామెడీతో ఈవెంట్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చడం ఖాయం. నవీన్ పోలిశెట్టితో పాటు హాట్ యాంకర్ రష్మీ కూడా హోస్ట్ గా కనిపిస్తుందట. నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 22, 2021 2:38 pm
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…