సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ అంటే ముందుగా.. యాంకర్ సుమని సంప్రదిస్తారు. అందులోనూ.. భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆమెకి రెమ్యునరేషన్ గా ఇచ్చి హోస్ట్ చేయిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీ జనాలపై పంచ్ లు, కౌంటర్లు వేసేంత ఫ్రీడమ్ యాంకర్లలో అంటే సుమకి మాత్రమే ఉంటుందని చెప్పాలి.
మిగిలిన వాళ్లు ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడతారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం సుమను తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈసారి ప్రభాస్ టీమ్ కొత్తగా ట్రై చేస్తుందట. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా ఫిక్స్ చేశారట.
ప్రభాస్ తో, యువి బ్యానర్ తో ఉన్న అనుబంధంతో నవీన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని నవీన్ పోలిశెట్టిని రంగంలోకి దింపారు. నవీన్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే.. తన పంచ్ లు, కామెడీతో ఈవెంట్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చడం ఖాయం. నవీన్ పోలిశెట్టితో పాటు హాట్ యాంకర్ రష్మీ కూడా హోస్ట్ గా కనిపిస్తుందట. నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 22, 2021 2:38 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…