సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ అంటే ముందుగా.. యాంకర్ సుమని సంప్రదిస్తారు. అందులోనూ.. భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆమెకి రెమ్యునరేషన్ గా ఇచ్చి హోస్ట్ చేయిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీ జనాలపై పంచ్ లు, కౌంటర్లు వేసేంత ఫ్రీడమ్ యాంకర్లలో అంటే సుమకి మాత్రమే ఉంటుందని చెప్పాలి.
మిగిలిన వాళ్లు ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడతారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం సుమను తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈసారి ప్రభాస్ టీమ్ కొత్తగా ట్రై చేస్తుందట. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా ఫిక్స్ చేశారట.
ప్రభాస్ తో, యువి బ్యానర్ తో ఉన్న అనుబంధంతో నవీన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని నవీన్ పోలిశెట్టిని రంగంలోకి దింపారు. నవీన్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే.. తన పంచ్ లు, కామెడీతో ఈవెంట్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చడం ఖాయం. నవీన్ పోలిశెట్టితో పాటు హాట్ యాంకర్ రష్మీ కూడా హోస్ట్ గా కనిపిస్తుందట. నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…