సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఈవెంట్స్ అంటే ముందుగా.. యాంకర్ సుమని సంప్రదిస్తారు. అందులోనూ.. భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్స్ అంటే కచ్చితంగా సుమ ఉండాల్సిందే. లక్షన్నర నుంచి రెండు లక్షలు ఆమెకి రెమ్యునరేషన్ గా ఇచ్చి హోస్ట్ చేయిస్తుంటారు. పైగా.. ఇండస్ట్రీ జనాలపై పంచ్ లు, కౌంటర్లు వేసేంత ఫ్రీడమ్ యాంకర్లలో అంటే సుమకి మాత్రమే ఉంటుందని చెప్పాలి.
మిగిలిన వాళ్లు ఈ విషయంలో కాస్త ఇబ్బందిపడతారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మాత్రం సుమను తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈసారి ప్రభాస్ టీమ్ కొత్తగా ట్రై చేస్తుందట. టాలీవుడ్ లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టిని ‘రాధేశ్యామ్’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి యాంకర్ గా ఫిక్స్ చేశారట.
ప్రభాస్ తో, యువి బ్యానర్ తో ఉన్న అనుబంధంతో నవీన్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేయాలని నవీన్ పోలిశెట్టిని రంగంలోకి దింపారు. నవీన్ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే.. తన పంచ్ లు, కామెడీతో ఈవెంట్ ని మరింత ఎంటర్టైనింగ్ గా మార్చడం ఖాయం. నవీన్ పోలిశెట్టితో పాటు హాట్ యాంకర్ రష్మీ కూడా హోస్ట్ గా కనిపిస్తుందట. నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…