సినీ పరిశ్రమలో తాను పెద్దగా ఎవరితోనూ కలవనని.. కానీ చిరంజీవిని కలుస్తానని.. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఆయనొకరని గతంలో ఓ సందర్భంలో చెప్పాడు బాలయ్య. వీరి అభిమానుల మధ్య ఎంత అంతరం ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరూ చాలా వరకు సన్నిహితంగానే కనిపిస్తారు. కానీ ఈ మధ్య ఎందుకో ఇద్దరి మధ్య అగాథం నెలకొంది. పరిశ్రమకు పెద్దగా ఉంటూ అన్ని కార్యక్రమాలనూ నడిపిస్తున్న చిరు మీద పరోక్షంగా బాలయ్య విమర్శలు చేస్తున్నాడు. ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు.
దీనికి బీజం ఆ మధ్య చిరంజీవి ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమం దగ్గర పడిందని బాలయ్య తాజాగా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. చిరంజీవి ఇంట్లో జరిగిన ఆ వేడుకకు బాలయ్యను ఆహ్వానించలేదట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే చెప్పాడు.
ఈ నెల 10న తన షష్టిపూర్తిని పురస్కరించుకుని బాలయ్య వరుసగా టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఓ ఛానెల్తో మాట్లాడుతూ చిరుతో సంబంధాల గురించి స్పందించాడు బాలయ్య.
గతంలో చిరు మీకు అత్యంత ఆప్త మిత్రుడు అన్నారు.. ఆయన షష్టిపూర్తి సందర్భంగా జరిగిన వేడుకల్లో డ్యాన్స్ కూడా చేశారు.. ఇంకా పలు సందర్భాల్లో సన్నిహితంగా ఉన్నారు.. మరి ఇప్పుడేమైంది అని యాంకర్ బాలయ్యను ప్రశ్నించగా.. 80వ దశకానికి చెందిన నటీనటులందరం ప్రతి సంవత్సరం కలిసే వాళ్లమని.. చెన్నై, బెంగళూరుల్లో జరిగిన వేడుకలకు తాను హాజరయ్యానని.. కానీ గత ఏడాది చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరగ్గా దానికి చిరు తనను ఆహ్వానించలేదని బాలయ్య అన్నాడు.
ఎక్కడెక్కడో జరిగిన వేడుకల్లో తాము కలిసి పాల్గొన్నామని.. కానీ చిరు ఇంట్లో జరిగిన వేడుకకు తనను ఎందుకు పిలవలేదో తనకు తెలియదని బాలయ్య అన్నాడు. తాను ఇలాంటివి పట్టించుకోనని.. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలన్నది తన అభిమతమని బాలయ్య చెప్పాడు. మరి ఆ కోపంతోనే బాలయ్య ఇప్పుడు చిరు మీద పరోక్షలు విమర్శలు చేస్తున్నాడనుకోవాలా?
This post was last modified on June 9, 2020 4:46 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…