Movie News

చిరంజీవి తన ఇంటికి నన్నెందుకు పిలవలేదు-బాలయ్య

సినీ పరిశ్రమలో తాను పెద్దగా ఎవరితోనూ కలవనని.. కానీ చిరంజీవిని కలుస్తానని.. తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తుల్లో ఆయనొకరని గతంలో ఓ సందర్భంలో చెప్పాడు బాలయ్య. వీరి అభిమానుల మధ్య ఎంత అంతరం ఉన్నప్పటికీ.. ఈ ఇద్దరూ చాలా వరకు సన్నిహితంగానే కనిపిస్తారు. కానీ ఈ మధ్య ఎందుకో ఇద్దరి మధ్య అగాథం నెలకొంది. పరిశ్రమకు పెద్దగా ఉంటూ అన్ని కార్యక్రమాలనూ నడిపిస్తున్న చిరు మీద పరోక్షంగా బాలయ్య విమర్శలు చేస్తున్నాడు. ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు.

దీనికి బీజం ఆ మధ్య చిరంజీవి ఇంట్లో జరిగిన ఎయిటీస్ రీయూనియన్ కార్యక్రమం దగ్గర పడిందని బాలయ్య తాజాగా వ్యాఖ్యల్ని బట్టి అర్థమవుతోంది. చిరంజీవి ఇంట్లో జరిగిన ఆ వేడుకకు బాలయ్యను ఆహ్వానించలేదట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే చెప్పాడు.

ఈ నెల 10న తన షష్టిపూర్తిని పురస్కరించుకుని బాలయ్య వరుసగా టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ చిరుతో సంబంధాల గురించి స్పందించాడు బాలయ్య.

గతంలో చిరు మీకు అత్యంత ఆప్త మిత్రుడు అన్నారు.. ఆయన షష్టిపూర్తి సందర్భంగా జరిగిన వేడుకల్లో డ్యాన్స్ కూడా చేశారు.. ఇంకా పలు సందర్భాల్లో సన్నిహితంగా ఉన్నారు.. మరి ఇప్పుడేమైంది అని యాంకర్ బాలయ్యను ప్రశ్నించగా.. 80వ దశకానికి చెందిన నటీనటులందరం ప్రతి సంవత్సరం కలిసే వాళ్లమని.. చెన్నై, బెంగళూరుల్లో జరిగిన వేడుకలకు తాను హాజరయ్యానని.. కానీ గత ఏడాది చిరంజీవి ఇంట్లోనే ఈ వేడుక జరగ్గా దానికి చిరు తనను ఆహ్వానించలేదని బాలయ్య అన్నాడు.

ఎక్కడెక్కడో జరిగిన వేడుకల్లో తాము కలిసి పాల్గొన్నామని.. కానీ చిరు ఇంట్లో జరిగిన వేడుకకు తనను ఎందుకు పిలవలేదో తనకు తెలియదని బాలయ్య అన్నాడు. తాను ఇలాంటివి పట్టించుకోనని.. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలన్నది తన అభిమతమని బాలయ్య చెప్పాడు. మరి ఆ కోపంతోనే బాలయ్య ఇప్పుడు చిరు మీద పరోక్షలు విమర్శలు చేస్తున్నాడనుకోవాలా?

This post was last modified on June 9, 2020 4:46 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

51 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago