మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమార్ పోషించిన పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని సమాచారం. తన ఇన్నేళ్ల కెరీర్ లో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా తెలుగు సినిమాల్లో నటించలేదు. తొలిసారి చిరంజీవి మీద ఉన్న అభిమానంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
సినిమాలో సల్మాన్ రోల్ చిన్నదే అయినా.. చాలా ఎఫెక్టివ్ గా చూపించబోతున్నారట. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించినట్లు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరిలో షూటింగ్ పెట్టుకోమని చెప్పారట సల్మాన్. దానికి తగ్గట్లుగానే మిగిలిన నటీనటుల డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
ఈ సినిమాలో నయనతార మరో కీలకపాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, దర్శకుడు బాబీ రూపొందిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి. రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఫ్యూచర్ లో ఆయన మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…