మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమార్ పోషించిన పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని సమాచారం. తన ఇన్నేళ్ల కెరీర్ లో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ కూడా తెలుగు సినిమాల్లో నటించలేదు. తొలిసారి చిరంజీవి మీద ఉన్న అభిమానంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
సినిమాలో సల్మాన్ రోల్ చిన్నదే అయినా.. చాలా ఎఫెక్టివ్ గా చూపించబోతున్నారట. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించినట్లు తెలుస్తోంది. 2022 ఫిబ్రవరిలో షూటింగ్ పెట్టుకోమని చెప్పారట సల్మాన్. దానికి తగ్గట్లుగానే మిగిలిన నటీనటుల డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.
ఈ సినిమాలో నయనతార మరో కీలకపాత్రలో కనిపించనుంది.
ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’, దర్శకుడు బాబీ రూపొందిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి. రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఫ్యూచర్ లో ఆయన మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు.
This post was last modified on December 22, 2021 8:32 am
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…