సాయిధరమ్ తేజ్ కెరీర్ ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు గట్టి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అతడి తొలి సినిమా ‘రేయ్’తో కంగుతిన్నాడు. ఆ సినిమా ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోకపోవడం.. దీంతో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ పేరుతో మరో సినిమా మొదలుపెట్టి దాన్నే ముందు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత రిలీజైన ‘రేయ్’ అంచనాలకు తగ్గట్లే చతికిలపడింది.
ఆపై సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీత్ సినిమాలతో మాంచి ఊపు మీద కనిపించాడు తేజు. ఇక అతను మరో రేంజికి వెళ్లిపోతాడనుకుంటే.. వరుసగా ఒకటి రెండు కాదు.. అరడజను ఫ్లాపులతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఓ మోస్తరు విజయం కోసం అతను తహతహలాడిపోయే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అతను పూర్తి నైరాశ్యంలో ఉన్న టైంలో పూర్తిగా అవతారం మార్చి, తన శైలికి భిన్నంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన ‘చిత్రలహరి’ కాస్త ఉపశమనాన్ని అందించింది.
ఆపై ‘ప్రతి రోజూ పండగే’ లాంటి ఎంటర్టైనర్తో పెద్ద విజయాన్నే అందుకున్నాడు. ఈ ఉత్సాహంలో రొటీన్కు భిన్నంగా, ప్రయోగాత్మకంగా, సందేశంతో ముడిపడ్డ ‘రిపబ్లిక్’ చేశాడు తేజు. ఐతే అతడి సాహసానికి తగిన బాక్సాఫీస్ ఫలితం దక్కలేదు. మంచి సినిమానే అయినా ఇది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. చిత్ర బృందం దీన్ని గొప్ప సినిమాగా ప్రమోట్ చేసుకుంటున్నా.. ఓటీటీలో దీనికి మంచి స్పందనే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఇది పెద్ద ఫెయిల్యూర్ అనడంలో సందేహం లేదు. దీంతో తేజు ఒక్కసారిగా రూటు మార్చేశాడు.
ఇలాంటి ప్రయోగాలు ఇక నడవవని పక్కా మాస్ మసాలా మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. అతను మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన సంపత్ నందితో సినిమా చేయబోతున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతోందీ చిత్రాన్ని. ‘రిపబ్లిక్’ ఫలితానికి తోడు.. అఖండ, పుష్ప లాంటి మాస్ చిత్రాలకు దక్కుతున్న ఆదరణ చూశాక తేజు మరో రిస్క్ చేయడానికి రెడీగా లేనట్లున్నాడు. కెరీర్ మరోసారి ప్రమాదంలో పడేలా ఉండటంతో రిస్క్ లేకుండా మాస్ సినిమా చేయాలని ఫిక్సయినట్లున్నాడు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on December 20, 2021 4:35 pm
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నుంచి వచ్చిన చివరి చిత్రం జననాయగన్ మీద అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ…
ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…
నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…