శుక్రవారం భారీ అంచనాల మధ్య రిలీజైన ‘పుష్ప’ సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. ఉదయం షోలు అయ్యేసరికి కొందరు సినిమా బాగుందన్నారు. కొందరు బాలేదన్నారు. కొందరేమో మధ్య రకంగా మాట్లాడారు. కానీ సాయంత్రానికి నెగెటివ్ టాకే ఎక్కువగా వినిపించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు చోట్లా నెగెటివిటీనే ఎక్కువగా కనిపించింది. రివ్యూల విషయానికి వచ్చినా ‘పుష్ప’ గురించి ఎక్కువగా ప్రతికూలంగానే స్పందించారు.
ఎవ్వరూ ఫుల్ పాజిటివ్ రివ్యూలైతే ఇవ్వలేదు. ముందు రోజే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం వల్ల తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లకైతే ఢోకా లేదు. సినిమా పట్ల ప్రేక్షకుల అసలు స్పందన ఎలా ఉందన్నది సోమవారానికి స్పష్టంగా తెలియవచ్చు. ప్రస్తుతానికైతే టాక్, రివ్యూలన్నీ ‘పుష్ప’కు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి.ఐతే తెలుగుతో పోలిస్తే.. ‘పుష్ప’కు తమిళం, మలయాళంలో స్పందన చాలా మెరుగ్గా కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఈ సినిమా నేటివిటీ పరంగా చూసినా, అభిరుచి కోణంలో చూసినా వాళ్లకే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ‘పుష్ప’కు తమిళం, మలయాళంలో చాలా వరకు పాజిటివ్ రివ్యూలు రావడం విశేషం. 3, 3 ప్లస్ రేటింగ్స్లో రివ్యూలు వచ్చాయి అక్కడ. ఇందులో కొన్ని పెయిడ్ రివ్యూలు ఉండొచ్చు గాక.. కానీ న్యూట్రల్గా ఉండే సమీక్షకులు, వెబ్ సైట్లు కూడా ఈ సినిమాకు తమిళం, మలయాలంలో పాజిటివ్ రివ్యూలివ్వడం గమనార్హం.
హిందీలో ఈ పరిస్థితి లేదు. అక్కడ ఎక్కువగా నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. ‘పుష్ప’ తరహా రస్టిక్, రగ్డ్ మూవీస్తో తమిళ, మలయాళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. నిజానికి ఆ రెండు భాషల్లోనే ఎక్కువగా అటవీ నేపథ్యంలో, డీగ్లామర్ లీడ్ క్యారెక్టర్లతో ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీస్తుంటారు. వీటికి అక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంటారు. ‘పుష్ప’కు అలాగే కనెక్ట్ అవుతున్నట్లున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో తొలి రోజు ‘పుష్ప’కు మంచి వసూళ్లు కూడా వచ్చాయి.
This post was last modified on December 18, 2021 8:25 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…