రవితేజతో గొడవ.. చెక్ పెట్టనున్న బాలయ్య!

ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ పక్క సినిమాలతో పాటు ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ అనే షోని హోస్ట్ చేస్తున్నారు. ఈ టాక్ షో టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. బాలయ్య లాంటి అగ్ర హీరో తన హోస్టింగ్ స్కిల్స్ తో షో రేంజ్ ని పెంచేశారు.

ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, రాజమౌళి ఇలా పేరున్న తారలను ఈ షోకి అతిథులుగా తీసుకొచ్చారు.
త్వరలోనే మహేష్ బాబు కూడా ఈ షోలో కనిపించబోతున్నారు. కానీ ఆ ఎపిసోడ్ ని సీజన్ లాస్ట్ లో టెలికాస్ట్ చేస్తారని సమాచారం.

ఇదిలా ఉండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ ఈ షోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా రాబోతున్నారట. గతంలో రవితేజ, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. రవితేజ మెగా కాంపౌండ్ మనిషని.. అందుకే బాలయ్యతో విభేదాలు ఉన్నాయని రకరకాలుగా ప్రచారం జరిగేది.

దానికి తగ్గట్లే.. వీరిద్దరూ కూడా ఎక్కడా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడం కానీ జరగలేదు. ఇప్పుడు ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టనున్నారు బాలయ్య. రవితేజతో కలిసి ఒకే వేదికపై కనిపించడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. అది కూడా ‘అన్ స్టాపబుల్’ షోలో కావడం విశేషం. ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో చూడాలి మరి!