ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ‘పుష్ప’ మూవీ. ఐతే ఇప్పటిదాకా ఫైనల్ కాపీ రెడీ కాలేదన్న సమాచారం బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఆందోళనలోకి నెడుతోంది. మామూలుగానే సుకుమార్ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుంటుంది. విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు ఎడిటింగ్ జరుగుతుంటుంది. చివరి వరకు చిన్న చిన్న కరెక్షన్లు చేస్తూనే ఉంటాడు సుకుమార్. ‘పుష్ప’ విషయంలో మరింత ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.
మొన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్కు కూడా సుకుమార్ రాలేని పరిస్థితి తలెత్తింది. వేరే ప్రమోషన్లలో కూడా ఆయన కనిపించడం లేదు. ముంబయిలో కూర్చుని డీఐ పనులను పర్యవేక్షిస్తూ.. ఇంకోవైపు ఎడిటర్ను పక్కన పెట్టుకుని చిన్న చిన్న కరెక్షన్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విడుదలకు మూడు రోజుల ముందు కూడా ఫైనల్ కాపీ రెడీ కాలేదు.మామూలుగా ఓవర్సీస్కు నాలుగైదు రోజుల ముందే ఫైనల్ కాపీ ఓకే చేసి కేడీఎంలు పంపేయాలి. కానీ ‘పుష్ప’ విషయంలో అలా జరగలేదు.
మిగతా ఏరియాల సంగతే చెప్పాల్సిన పనే లేదు. యుఎస్కు మంగళవారం కేడీఎంలు పంపినప్పటికీ.. అవి ఫైనల్ కాదని చెప్పారట. కొన్ని కరెక్షన్లు జరుగుతాయని, వాటిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చారట. కొన్ని సన్నివేశాలను తీసేయడం, వేరేవి యాడ్ చేయడం జరుగుతుండటంతో వివిధ భాషల పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆయా సిటీల్లో ఉండి పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు దిక్కు తోచని పరిస్థితి నెలకొందట.
ఇలా కరెక్షన్లు చేయడం వల్ల మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిపించి కొత్తగా కలిపిన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది. కొత్తగా కలిపిన సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ చేయించి వాటిని ఫైనల్ మిక్స్ చేసి చివరగా ఫైనల్ కాపీ తీయనున్నారు. ఈ పని విడుదలకు ముందు రోజు కానీ పూర్తి కాదని.. దీని వల్ల యుఎస్ ప్రిమియర్స్ విషయంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ బాగా టెన్షన్ పడుతున్నారని.. వివిధ భాషల్లోనూ బయ్యర్లు సమయానికి సినిమా రిలీజవుతుందా లేదా అనే ఆందోళనతోనే ఉన్నారని తెలిసింది.
This post was last modified on December 15, 2021 3:49 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…