ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ‘పుష్ప’ మూవీ. ఐతే ఇప్పటిదాకా ఫైనల్ కాపీ రెడీ కాలేదన్న సమాచారం బయ్యర్లు, ఎగ్జిబిటర్లను ఆందోళనలోకి నెడుతోంది. మామూలుగానే సుకుమార్ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుంటుంది. విడుదలకు కొన్ని రోజుల ముందు వరకు ఎడిటింగ్ జరుగుతుంటుంది. చివరి వరకు చిన్న చిన్న కరెక్షన్లు చేస్తూనే ఉంటాడు సుకుమార్. ‘పుష్ప’ విషయంలో మరింత ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.
మొన్న జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్కు కూడా సుకుమార్ రాలేని పరిస్థితి తలెత్తింది. వేరే ప్రమోషన్లలో కూడా ఆయన కనిపించడం లేదు. ముంబయిలో కూర్చుని డీఐ పనులను పర్యవేక్షిస్తూ.. ఇంకోవైపు ఎడిటర్ను పక్కన పెట్టుకుని చిన్న చిన్న కరెక్షన్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విడుదలకు మూడు రోజుల ముందు కూడా ఫైనల్ కాపీ రెడీ కాలేదు.మామూలుగా ఓవర్సీస్కు నాలుగైదు రోజుల ముందే ఫైనల్ కాపీ ఓకే చేసి కేడీఎంలు పంపేయాలి. కానీ ‘పుష్ప’ విషయంలో అలా జరగలేదు.
మిగతా ఏరియాల సంగతే చెప్పాల్సిన పనే లేదు. యుఎస్కు మంగళవారం కేడీఎంలు పంపినప్పటికీ.. అవి ఫైనల్ కాదని చెప్పారట. కొన్ని కరెక్షన్లు జరుగుతాయని, వాటిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం ఇచ్చారట. కొన్ని సన్నివేశాలను తీసేయడం, వేరేవి యాడ్ చేయడం జరుగుతుండటంతో వివిధ భాషల పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆయా సిటీల్లో ఉండి పర్యవేక్షిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లకు దిక్కు తోచని పరిస్థితి నెలకొందట.
ఇలా కరెక్షన్లు చేయడం వల్ల మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టులను పిలిపించి కొత్తగా కలిపిన సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పించుకోవాల్సి వస్తోంది. కొత్తగా కలిపిన సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ చేయించి వాటిని ఫైనల్ మిక్స్ చేసి చివరగా ఫైనల్ కాపీ తీయనున్నారు. ఈ పని విడుదలకు ముందు రోజు కానీ పూర్తి కాదని.. దీని వల్ల యుఎస్ ప్రిమియర్స్ విషయంలో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ బాగా టెన్షన్ పడుతున్నారని.. వివిధ భాషల్లోనూ బయ్యర్లు సమయానికి సినిమా రిలీజవుతుందా లేదా అనే ఆందోళనతోనే ఉన్నారని తెలిసింది.
This post was last modified on December 15, 2021 3:49 pm
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…