బ్రహ్మాస్త్ర.. బాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్స్లో ఇదొకటి. రణ్బీర్ కపూర్, ఆలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి పాపులర్ స్టార్స్ చాలామంది నటిస్తుండటంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే నాలుగేళ్ల నుంచి సినిమాని చెక్కుతూనే ఉన్నాడు అయాన్ ముఖర్జీ.
షూటింగ్ పూర్తయ్యిందని ఈమధ్యే తెలియడంతో త్వరలోనే రిలీజ్ ఉంటుందని ఆశించారంతా. కానీ ఆ ఆశ అంత త్వరగా తీరేలా కనిపించడం లేదు. బ్రహ్మాస్త్ర చిత్రాన్ని వచ్చే యేడు సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు నిర్మాత కరణ్ జోహార్. అంటే దాదాపు ఇంకో సంవత్సరం పాటు ఈ మూవీ కోసం వెయిట్ చేయాలన్నమాట.
ఇదొక సూపర్ హీరో ఫిల్మ్. త్రీడీ, ఐమాక్య్ ఫార్మాట్స్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
అదీ మూడు భాగాలుగా. మొదటి భాగమే ఐదేళ్లకు రిలీజైతే మిగిలినవి ఎప్పటికి వస్తాయనేది ఊహకు కూడా అందని విషయం. అయితే తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే మాత్రం సినిమాపై ఆసక్తి పెరగడం ఖాయం. శివ అనే పాత్రలో రణ్బీర్ నటించాడు.
మండే మంటల మధ్య చొక్కా కూడా లేకుండా నిలబడి ఆవేశంగా కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచంలోని దుష్టశక్తులన్నింటితోటీ పోరాడటానికి సిద్ధంగా ఉన్న వీరుడిలా ఉన్నాడు. మరికొన్ని గంటల్లో మోషన్ పోస్టర్ కూడా వదలబోతున్నారు. అది మరింత సర్ప్రైజింగ్గా ఉంటుందని ఊరిస్తున్నారు. ఇన్నేళ్ల వెయిటింగ్కి ఆ మాత్రం ఫలితం ఉండాలిగా మరి.
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…
ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం విపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి. నంద్యాలలో ఆదివారం ఉదయం వైఎస్ విగ్రహం ధ్వంసం ఘటనలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…