మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఊపు లేరు. వరుసగా సినిమాలు చేసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆచార్య త్వరలోనే విడుదల కానుండగా.. ఇంకో మూడు సినిమాలను ప్రకటించి, సమాంతరంగా ఆ మూడు చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు మెగాస్టార్. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు చిరు కొత్తగా మరో సినిమాను ప్రకటించారు. తనకు వీరాభిమాని అయిన యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి వెల్లడైన సంగతి తెలిసిందే.
ఛలో, భీష్మ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన వెంకీతో చిరు సినిమా చేయబోతుండటం అభిమానులను బాగానే ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఐతే ఆయనకు తోడుగా డాక్టర్ మాధవి రాజు అనే నిర్మాత కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం గమనార్హం.
ఐతే ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనిది, ఎప్పుడూ విననిది. ఇంతకీ ఎవరీ మాధవీ రాజు అని అంతా సోషల్ మీడియాలో వెతకడం మొదలైంది. ఈమె ఎవరో కాదు.. చిరంజీవికి స్వయంగా సోదరి. చిరుకు ఇద్దరు సోదరీమణులున్న సంగతి తెలిసిందే. అందులో ఒకరు విజయదుర్గ. ఆమె సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ల తల్లి. ఈమె సినిమా ఈవెంట్లలో, అక్కడా ఇక్కడా కాస్త కనిపిస్తుంటారు కాబట్టి జనాలకు ఓ మోస్తరుగా తెలుసు.
కానీ ఇంకో సోదరి మాధవీ రావు మీడియాలో కనిపించడం చాలా తక్కువ. ఆమె వైద్యురాలు. చిరంజీవి నిర్వహించిన వైద్య శిబిరాల్లో, కుటుంబ వేడుకల్లో కొన్నిసార్లు కనిపించారు. మరో సోదరి కొడుకులిద్దరినీ సినిమాల్లోకి తీసుకొచ్చి వాళ్లు నిలదొక్కుకునేలా చేయడంలో చిరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంకో సోదరిని నిర్మాతగా పరిచయం చేసి ఆమెకు తన వంతు చేయాల్సిన సాయం చేస్తున్నారన్నమాట.
This post was last modified on December 15, 2021 10:48 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…