మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మామూలు ఊపు లేరు. వరుసగా సినిమాలు చేసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆచార్య త్వరలోనే విడుదల కానుండగా.. ఇంకో మూడు సినిమాలను ప్రకటించి, సమాంతరంగా ఆ మూడు చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నాడు మెగాస్టార్. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు చిరు కొత్తగా మరో సినిమాను ప్రకటించారు. తనకు వీరాభిమాని అయిన యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి వెల్లడైన సంగతి తెలిసిందే.
ఛలో, భీష్మ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన వెంకీతో చిరు సినిమా చేయబోతుండటం అభిమానులను బాగానే ఎగ్జైట్ చేస్తోంది. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. ఐతే ఆయనకు తోడుగా డాక్టర్ మాధవి రాజు అనే నిర్మాత కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడం గమనార్హం.
ఐతే ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేనిది, ఎప్పుడూ విననిది. ఇంతకీ ఎవరీ మాధవీ రాజు అని అంతా సోషల్ మీడియాలో వెతకడం మొదలైంది. ఈమె ఎవరో కాదు.. చిరంజీవికి స్వయంగా సోదరి. చిరుకు ఇద్దరు సోదరీమణులున్న సంగతి తెలిసిందే. అందులో ఒకరు విజయదుర్గ. ఆమె సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ల తల్లి. ఈమె సినిమా ఈవెంట్లలో, అక్కడా ఇక్కడా కాస్త కనిపిస్తుంటారు కాబట్టి జనాలకు ఓ మోస్తరుగా తెలుసు.
కానీ ఇంకో సోదరి మాధవీ రావు మీడియాలో కనిపించడం చాలా తక్కువ. ఆమె వైద్యురాలు. చిరంజీవి నిర్వహించిన వైద్య శిబిరాల్లో, కుటుంబ వేడుకల్లో కొన్నిసార్లు కనిపించారు. మరో సోదరి కొడుకులిద్దరినీ సినిమాల్లోకి తీసుకొచ్చి వాళ్లు నిలదొక్కుకునేలా చేయడంలో చిరు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఇంకో సోదరిని నిర్మాతగా పరిచయం చేసి ఆమెకు తన వంతు చేయాల్సిన సాయం చేస్తున్నారన్నమాట.
This post was last modified on December 15, 2021 10:48 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…