ఇప్పుడు దేశంలో ప్రతి హీరో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకునే దర్శకుల్లో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. బాహుబలితో ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ఆ సినిమాతో ప్రపంచ స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం జక్కన్నతో ఓ సినిమా చేయాలని ఆశ పడుతుంటారంటే అతిశయోక్తి కాదు.
ఇక మన స్టార్ల గురించి చెప్పేదేముంది? సీనియర్లను పక్కన పెడితే తెలుగులో కొంతమంది పెద్ద స్టార్లతో జక్కన్న సినిమాలు చేశాడు కానీ.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లతో ఇప్పటిదాకా జట్టు కట్టలేదు. మహేష్ బాబుతో త్వరలోనే ఆయన సినిమా మొదలు కాబోతోంది. పవన్ కళ్యాణ్తో అయితే రాజమౌళి సినిమా చేసే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.
అయితే అల్లు అర్జున్తో మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రాజమౌళి సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పుష్ప ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ గురించి రాజమౌళి గొప్పగా మాట్లాడటంతో వీరి కలయికలో సినిమా మీద అభిమానులకు ఆశలు కలిగాయి. ఇంతకీ రాజమౌళి మాటలు విని మీకేమనిపించింది.. ఆయనతో సినిమా సంగతేంటి అని మీడియా వాళ్లు బన్నీని అడిగితే.. ఆయన మాటలు చాలా ఆనందం కలిగించాయి. నా మనసును తాకాయి. ఆయనతో సినిమా చేయాలని ఏ హీరోకి ఉండదు? నాక్కూడా ఉంది.
మీతో సినిమా చేయాలనుందని ఆయన్ని నేనూ అడిగా. తప్పకుండా చేద్దామని, తాను సినిమా చేయాలనుకునే హీరోల్లో నేనూ ఒకడినని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని నమ్ముతున్నా అని బన్నీ చెప్పాడు. ప్రస్తుత కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే రెండు మూడేళ్లలో రాజమౌళి, బన్నీ కలిసి సినిమా చేయకపోవచ్చు. తన కలల ప్రాజెక్టు అయిన మహాభారతం తీసేలోపు బన్నీతో జక్కన్న ఓ సినిమా చేస్తాడేమో చూద్దాం మరి.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…