ఇప్పుడు దేశంలో ప్రతి హీరో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకునే దర్శకుల్లో రాజమౌళి పేరు ముందు వరుసలో ఉంటుంది. బాహుబలితో ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందో తెలిసిందే. ఆ సినిమాతో ప్రపంచ స్థాయిలో ఆయన పేరు మార్మోగింది. బాలీవుడ్ సూపర్ స్టార్లు సైతం జక్కన్నతో ఓ సినిమా చేయాలని ఆశ పడుతుంటారంటే అతిశయోక్తి కాదు.
ఇక మన స్టార్ల గురించి చెప్పేదేముంది? సీనియర్లను పక్కన పెడితే తెలుగులో కొంతమంది పెద్ద స్టార్లతో జక్కన్న సినిమాలు చేశాడు కానీ.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్లతో ఇప్పటిదాకా జట్టు కట్టలేదు. మహేష్ బాబుతో త్వరలోనే ఆయన సినిమా మొదలు కాబోతోంది. పవన్ కళ్యాణ్తో అయితే రాజమౌళి సినిమా చేసే అవకాశాలు అంతగా కనిపించడం లేదు.
అయితే అల్లు అర్జున్తో మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రాజమౌళి సినిమా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల పుష్ప ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ గురించి రాజమౌళి గొప్పగా మాట్లాడటంతో వీరి కలయికలో సినిమా మీద అభిమానులకు ఆశలు కలిగాయి. ఇంతకీ రాజమౌళి మాటలు విని మీకేమనిపించింది.. ఆయనతో సినిమా సంగతేంటి అని మీడియా వాళ్లు బన్నీని అడిగితే.. ఆయన మాటలు చాలా ఆనందం కలిగించాయి. నా మనసును తాకాయి. ఆయనతో సినిమా చేయాలని ఏ హీరోకి ఉండదు? నాక్కూడా ఉంది.
మీతో సినిమా చేయాలనుందని ఆయన్ని నేనూ అడిగా. తప్పకుండా చేద్దామని, తాను సినిమా చేయాలనుకునే హీరోల్లో నేనూ ఒకడినని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని నమ్ముతున్నా అని బన్నీ చెప్పాడు. ప్రస్తుత కమిట్మెంట్ల ప్రకారం చూస్తే వచ్చే రెండు మూడేళ్లలో రాజమౌళి, బన్నీ కలిసి సినిమా చేయకపోవచ్చు. తన కలల ప్రాజెక్టు అయిన మహాభారతం తీసేలోపు బన్నీతో జక్కన్న ఓ సినిమా చేస్తాడేమో చూద్దాం మరి.
This post was last modified on December 15, 2021 9:39 am
పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దేశ ప్రజలు…
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…