ఒక్కటీ రెండూ కాదు.. ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నారు చిరంజీవి. ఆచార్య, గాడ్ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతో పాటు బాబి సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు వాటి సరసన మరో సినిమా చేరింది. మెగాస్టార్ 156వ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది.
ఛలో, భీష్మ చిత్రాలు తీసి హిట్టు కొట్టిన వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి నటించనున్నారనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడది నిజమేనని కన్ఫర్మ్ అయ్యింది. వెంకీ, చిరుల కాంబినేషన్లో సినిమా రానున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాక్టర్ మాధవీ రాజు సహ నిర్మాత.
‘కొన్ని అవకాశాలు చాలా అరుదుగా దొరకుతాయి. నన్ను నమ్మి ఈ చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చిరంజీవి గారూ. మీపై నాకున్న ఆరాధన, నామీద మీకున్న నమ్మకమే నేను ఈ సినిమా విషయంలో బెస్ట్ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తాయి’ అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్గా చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాడు వెంకీ. మెగాస్టార్తో వర్క్ చేయడం ఆనందంగా ఉందంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రకటించింది. త్వరలోనే సినిమా సెట్స్కి వెళ్లబోతోంది.
వెంకీ కుడుముల చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని చిరంజీవి కూడా చెప్పారు. అలాంటి తనకి మెగాస్టార్ని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అది కూడా చాలా త్వరగా. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వెంకీ కెరీర్ ఎవరూ ఊహించని మలుపు తిరగడం ఖాయం. కాకపోతే ఇప్పటి వరకు యంగ్ హీరోలతో ఛలో, భీష్మ లాంటి యూత్ఫుల్ చిత్రాలే తీశాడు వెంకీ. మరి తన ఫేవరేట్ హీరో కోసం ఎలాంటి కథ అల్లాడో.. ఆయన్ని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొస్తాడో.
This post was last modified on December 14, 2021 7:04 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…