ఒక్కటీ రెండూ కాదు.. ఒకేసారి నాలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నారు చిరంజీవి. ఆచార్య, గాడ్ఫాదర్, భోళాశంకర్ చిత్రాలతో పాటు బాబి సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు వాటి సరసన మరో సినిమా చేరింది. మెగాస్టార్ 156వ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది.
ఛలో, భీష్మ చిత్రాలు తీసి హిట్టు కొట్టిన వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి నటించనున్నారనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇప్పుడది నిజమేనని కన్ఫర్మ్ అయ్యింది. వెంకీ, చిరుల కాంబినేషన్లో సినిమా రానున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాక్టర్ మాధవీ రాజు సహ నిర్మాత.
‘కొన్ని అవకాశాలు చాలా అరుదుగా దొరకుతాయి. నన్ను నమ్మి ఈ చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చిరంజీవి గారూ. మీపై నాకున్న ఆరాధన, నామీద మీకున్న నమ్మకమే నేను ఈ సినిమా విషయంలో బెస్ట్ ఇచ్చేందుకు ప్రోత్సహిస్తాయి’ అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్గా చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాడు వెంకీ. మెగాస్టార్తో వర్క్ చేయడం ఆనందంగా ఉందంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కూడా ప్రకటించింది. త్వరలోనే సినిమా సెట్స్కి వెళ్లబోతోంది.
వెంకీ కుడుముల చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో ఆ విషయాన్ని చిరంజీవి కూడా చెప్పారు. అలాంటి తనకి మెగాస్టార్ని డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అది కూడా చాలా త్వరగా. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే వెంకీ కెరీర్ ఎవరూ ఊహించని మలుపు తిరగడం ఖాయం. కాకపోతే ఇప్పటి వరకు యంగ్ హీరోలతో ఛలో, భీష్మ లాంటి యూత్ఫుల్ చిత్రాలే తీశాడు వెంకీ. మరి తన ఫేవరేట్ హీరో కోసం ఎలాంటి కథ అల్లాడో.. ఆయన్ని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకొస్తాడో.
This post was last modified on December 14, 2021 7:04 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…