ఒక సినిమాకు పని చేస్తున్న యూనిట్లో అందరికీ ఆ సినిమా కథేంటో తెలియాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు కథ మీద అవగాహన ఉండాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు పూర్తి కథ.. అలాగే తమ పాత్రలపై పూర్తి అవగాహన ఉంటే సినిమాలో మరింతగా ఇన్వాల్వ్ కావడానికి, ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశముంటుంది. ఐతే ‘పుష్ప’ సినిమాలో కథానాయికగా నటించిన రష్మిక మందన్నకు ఈ చిత్ర కథేంటో తెలియదట.
ఈ విషయాన్ని ‘పుష్ప’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసినపుడు స్వయంగా ఆమే వెల్లడించింది. ‘పుష్ప’ కథ విన్నపుడు మీకేమనిపించింది అని రష్మికను అడిగితే.. ‘‘సుకుమార్ సర్ నాకెప్పుడూ పూర్తి కథ చెప్పలేదు. నాకే కాదు.. యూనిట్లో చాలామందికి ఆయన కథ చెప్పలేదు. కానీ సుకుమార్ సార్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన్ని నమ్మి ముందుకెళ్లిపోయా.
డబ్బింగ్ టైంలో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూశా. ఇలాంటి సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉంది’’ అని రష్మిక చెప్పింది. ఇక ‘పుష్ప’ పార్ట్-1లో తన పాత్ర టీజర్ లాగా ఉంటుందని.. తొలి భాగంతో పోలిస్తే సెకండ్ పార్ట్లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం, నిడివి ఉంటాయని రష్మిక వెల్లడించింది. తనకు ‘పుష్ప’ కథేంటో తెలియదన్న రష్మిక మాటలకు మరీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
బేసిగ్గా సుకుమార్.. హీరో, కెమెరామన్కు మినహాయిస్తే కథ చెప్పరని.. స్టోరీ లీక్ అయిపోతుందన్న భయం దీనికో కారణం అయితే.. ఆయన స్క్రిప్టును ఎప్పుడూ లాక్ చేయరని, మేకింగ్ టైంలో కూడా మార్పులు చేర్పులు జరగడం వల్ల కథ ఇది అని ఎవరికీ చెప్పరని.. ఆయనతో పని చేసే రైటర్లకు కూడా కథ మీద క్లారిటీ ఉండదని సన్నిహితులు అంటుంటారు. ‘పుష్ప’ విషయంలోనూ ఆయన అదే ఒరవడిని కొనసాగించినట్లున్నారు.
This post was last modified on December 14, 2021 3:08 pm
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…
ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…