నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ మూవీ అంచనాలను మించిపోయి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు దక్కించుకుంది. టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. ఈ సినిమా తొలి వీకెండ్లో అన్ని సెంటర్లలో హౌస్ఫుల్స్తో రన్ అయింది. తెలుగు రాష్ట్రాల అవతల, ముఖ్యంగా యుఎస్లో ఈ సినిమాకు జరిగిన బుకింగ్స్, వచ్చిన వసూళ్లు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంకా బాక్సాఫీస్ పూర్తి స్థాయిలో పుంజుకోని రోజుల్లో విడుదలై ఈ స్థాయిలో థియేటర్లలో సందడి వాతావరణం తీసుకురావడంతో సినీ పరిశ్రమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్, రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టడం విశేషం. అఖండకు వరల్డ్ వైడ్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ రూ.56 కోట్లు. అంటే ఇప్పటికే బయ్యర్లందరూ లాభాల బాటలో ఉన్నారని భావించవచ్చు.
కానీ మిగతా అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. బయ్యర్లకు లాభాలు అందించింది కానీ.. ఒక్క ఆంధ్రా ఏరియాలో మాత్రం ఇంకా ఈ చిత్రం పెట్టుబడి వెనక్కి తేలేదు. నైజాంలో అఖండ హక్కుల్ని రూ.10.5 కోట్లకు కొన్న దిల్ రాజు.. ఆరేడు కోట్ల మధ్య లాభాల్లో ఉండగా, సీడెడ్లో ఈ చిత్రానికి రూ.15 కోట్ల మేర బిజినెస్ జరిగితే ఇప్పటికే రూ.12 కోట్ల దాకా షేర్ వచ్చింది, లాభాలు దక్కాయి.
కానీ ఆంధ్రాలోని మిగతా అన్ని జిల్లాలకు కలిపి ఈ చిత్రాన్ని రూ.26 కోట్లకు అమ్మితే ఇప్పటిదాకా వసూలైన షేర్ రూ.21.5 కోట్లే. ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ ఉండటం వల్లే ఇంకా ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోలేకపోయింది. ఇటు ఆంధ్రాలో, రాయలసీమలో సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతోనే నడిచినప్పటికీ.. ఏపీలో బ్రేక్ ఈవెన్కు ఇంకా చాలా దూరంలోనే ఉందీ చిత్రం. ఈ వారం పుష్పతో పాటు స్పైడర్ మ్యాన్ కూడా రిలీజవుతున్న నేపథ్యంలో ఆంధ్రాలో అఖండ స్వల్ప నష్టాలను మిగిల్చేలా ఉంది.
This post was last modified on December 14, 2021 8:32 am
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
అగ్ర దేశాల్లో ఒకటైన చైనా నిత్యం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. భారత్ సహా పలు దేశాలకు స్నేహ…