విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణలో గొప్ప ప్రతిభ ఉన్నా ఆయన ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేశాడు. ఆయనతో పని చేసిన పెద్ద హీరో అంటే నాని మాత్రమే. అతను కూడా మోహనకృష్ణతో కలిసి జీరో నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. దీంతో ఆ తర్వాత కూడా ఆయనతో రెండు సినిమాల్లో నటించాడు.
ఇంద్రగంటికి పెద్ద స్టార్లతో పని చేయాలని ఉంది, వాళ్లను డీల్ చేయగల సత్తా ఉంది కానీ.. ఆయనకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఇంద్రగంటి నుంచి రానున్న ‘వి’ను ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో చేయాలనుకున్నట్లుగా ఓ‘ ప్రచారం నడిచింది. ఈ విషయాన్ని ఇందులో కీలక పాత్ర చేసిన సుధీర్ బాబు కూడా ధ్రువీకరించాడు. ఇది పవన్, మహేష్ల కోసం అనుకున్న కథ అని ఇంద్రగంటి తనతో అన్నారని.. ఆ తర్వాత ఇందులో ఓ పాత్రను తనకే ఇచ్చాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సుధీర్.
ఐతే ఇదే విషయాన్ని ఇప్పుడు ఇంద్రగంటి వద్ద ప్రస్తావిస్తే.. నవ్వేశారు. ఈ కథను పవన్, మహేష్ చేస్తే బాగుంటుందని సరదాగా సుధీర్ దగ్గరన అన్నానని.. అంతే తప్ప వాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కథ తయారు చేయలేదని ఇంద్రగంటి స్పష్టం చేశాడు.
నాని ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు కాబట్టే అతడికి వరుసగా రెండోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇచ్చానని.. సినిమాలో రెండు ముఖ్య పాత్రల గురించి చెప్పి.. నెగెటివ్ రోల్ చేయమని అడిగితే తాను కూడా అదే కోరుకుంటున్నట్లు చెప్పి నాని మరోసారి రిస్క్ చేయడానికి రెడీ అయ్యాడని ఇంద్రగంటి చెప్పాడు.
తన కొత్త సినిమాల గురించి ఇంద్రగంటి మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో పాటు నాగచైతన్య కోసం కూడా కథలు సిద్ధం చేశానని.. వీరిలో ఎవరితో ముందు సినిమా చేస్తానో చెప్పలేనని అన్నాడు. ఐతే విశ్వసనీయ సమాచారం ప్రకారం దిల్ రాజు నిర్మాణంలో విజయ్ హీరోగా ఇంద్రగంటి తన తర్వాతి సినిమా చేసే అవకాశముంది.
This post was last modified on June 8, 2020 4:54 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…