Movie News

బాల‌య్య సెంచ‌రీ కొట్టేశాడ‌హో..

నంద‌మూరి బాల‌కృష్ణ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఆయ‌న సినిమా తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది. డిసెంబ‌రు 2న విడుద‌లైన అఖండ ప‌ది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుని ట్రేడ్ పండిట్ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇప్ప‌టిదాకా బాల‌య్య కెరీర్లో హైయెస్ట్ గ్రాస‌ర్ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణినే. తొలి వారంలోనే ఆ సినిమా క‌లెక్ష‌న్ల‌ను అఖండ దాటేసింది.

ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ మార్కునూ ట‌చ్ చేసేసింది. బాల‌య్య వీక్ జోన్ అయిన నైజాంలోనే ఈ చిత్రం రూ.26 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేయ‌డం విశేషం. ఆంధ్రా, రాయ‌ల‌సీమ క‌లిపి రూ.50 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌చ్చింది. ఇండియాలోని మిగ‌తా ప్రాంతాలు.. అలాగే ఓవ‌ర్సీస్ క‌లిపి ఈ చిత్రం అటు ఇటుగా పాతిక కోట్ల దాకా గ్రాస్ రాబ‌ట్టింది.

మొత్తంగా సినిమా వంద కోట్ల మార్కును అందుకుంది. షేర్ రూ.60 కోట్ల‌కు చేరువ‌గా ఉంది. తొలి వారంలోనే అఖండ రూ.80 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించ‌డం విశేషం. ఈ వారం రిలీజైన ఏ సినిమాలూ ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో అఖండ‌నే బాక్సాఫీస్ లీడ‌ర్‌గా కొన‌సాగుతోంది. రెండో వారంలో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ ప‌డుతుండ‌టం విశేషం. కెరీర్లో ఈ ద‌శ‌లో బాల‌య్య వంద కోట్ల మార్కును అందుకుంటాడ‌ని ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాలు లేవు.

అఖండ‌కు ముందు బాల‌య్య మార్కెట్ ఎంత‌గా ప‌త‌నం అయిందో తెలిసిందే. య‌న్.టి.ఆర్, రూల‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణ ఫ‌లితాన్నందుకున్నాయి. రూల‌ర్‌కు గ్రాస్ క‌లెక్ష‌న్లు కూడా 15 కోట్ల లోపే వ‌చ్చాయి. అలాంటిది అఖండ రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవ‌డం అసాధార‌ణ విష‌యమే. యావ‌రేజ్ టాకే వ‌చ్చినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ చిత్రానికి అన్నీ భ‌లేగా క‌లిసి రావ‌డంతో వ‌సూళ్ల మోత మోగిపోయింది.

This post was last modified on December 12, 2021 1:03 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

5 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago