క్రాక్ సక్సెస్ ఇచ్చిన కిక్లో వరుస సినిమాలకు కమిటయ్యాడు రవితేజ. వాటిలో అన్నింటికంటే ముందు సెట్స్కి వెళ్లిన సినిమా ఖిలాడి. రమేష్ వర్మ డైరెక్షన్లో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్. రవితేజ లుక్తో పాటు టీజర్ కూడా మూవీపై ఆసక్తిని పెంచేసింది. అయితే సినిమా చూడ్డానికి మాత్రం ప్రేక్షకులు చాలాకాలమే వెయిట్ చేయాల్సి వచ్చింది.
రవితేజ డ్యూయెల్ రోల్ చేసిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికీ షూటింగ్ పూర్తి కాలేదు. ఈలోపు రవితేజ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ని ప్రకటించాడు. సెట్స్కి తీసుకెళ్లాడు. ఈ చిత్రాన్ని మార్చ్ 25న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఖిలాడి వర్క్ మాత్రం ముందుకు కదలడం లేదని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ఓ షెడ్యూల్ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఫారిన్లో తీయాల్సిన సీన్స్ కావడం వల్లే ఇబ్బంది వస్తోంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో షూటింగులకి పర్మిషన్స్ లేవు. పైగా థర్డ్ వేవ్ కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. దాంతో ఖిలాడి భవిష్యత్తు కన్ఫ్యూజన్లో పడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పైగా రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీతో పాటు ధమాకా చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. బ్యాక్ టు బ్యాక్ షూటింగులతో బిజీబిజీగా ఉన్నాడు. వీటి తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఈ టైమ్లో బ్రేక్ తీసుకుని ఖిలాడి కోసం ఫారిన్ వెళ్లడం అయ్యే పనేనా? ఇవన్నీ చూస్తుంటే ఖిలాడి అనుకున్న టైమ్కి రావడం జరుగుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఖిలాడి కంటే రామారావే ముందు వచ్చేస్తాడనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంలో టీమ్ ఏమంటుందో చూడాలి మరి!
This post was last modified on December 11, 2021 10:41 pm
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…