Movie News

సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్ ఎవరు?

సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూ.. తరచూ హాట్ టాపిక్ గా మారిన సినిమాగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ను చెప్పాలి. ఈ సినిమాలో బన్నీ డైలాగ్.. షూటింగ్ దశలోనే ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప మూవీ హవా ప్రస్తుతం నడుస్తోంది. రిలీజ్ కు ముందే పాటలు.. ట్రైలర్.. డైలాగులు.. అభిమానుల్ని అలరించటమే కాదు.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఈ మూవీ కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్.. మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ మొదటి భాగం డిసెంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ను సమంత ఆడటం.. ఊర మాస్ స్టెప్పులతో అదిప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ‘‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఈ పాటకు గాత్రాన్ని అందించిన సింగర్ ఎవరన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది. గమ్మత్తుగా ఉన్న ఆమె వాయిస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

చంద్రబోస్ రాసిన పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో స్టేజ్ కు తీసుకెళ్లింది. ఇంతకూ ఈమె ఎవరు? అంటే.. ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జార్జిరెడ్డి మూవీకి పాడారు. తాజా పాటతో ఒక్కసారిగా ఆమె గురించి వివరాల సేకరణ ఎక్కవ కావటమే కాదు.. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది.

This post was last modified on December 11, 2021 6:37 pm

Share
Show comments

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

55 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago