సినిమా మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూ.. తరచూ హాట్ టాపిక్ గా మారిన సినిమాగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ను చెప్పాలి. ఈ సినిమాలో బన్నీ డైలాగ్.. షూటింగ్ దశలోనే ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప మూవీ హవా ప్రస్తుతం నడుస్తోంది. రిలీజ్ కు ముందే పాటలు.. ట్రైలర్.. డైలాగులు.. అభిమానుల్ని అలరించటమే కాదు.. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ఆత్రుత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఈ మూవీ కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్.. మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ మొదటి భాగం డిసెంబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ ను సమంత ఆడటం.. ఊర మాస్ స్టెప్పులతో అదిప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ‘‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అనే ఈ పాటకు గాత్రాన్ని అందించిన సింగర్ ఎవరన్న ఆసక్తి ఎక్కువ అవుతోంది. గమ్మత్తుగా ఉన్న ఆమె వాయిస్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
చంద్రబోస్ రాసిన పాటను పాడింది ఇంద్రావతి చౌహాన్. తన గొంతుతో ఈ పాటను మరో స్టేజ్ కు తీసుకెళ్లింది. ఇంతకూ ఈమె ఎవరు? అంటే.. ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో జార్జిరెడ్డి మూవీకి పాడారు. తాజా పాటతో ఒక్కసారిగా ఆమె గురించి వివరాల సేకరణ ఎక్కవ కావటమే కాదు.. ఆమె గురించి తెలుసుకునేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది.
This post was last modified on December 11, 2021 6:37 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…