Movie News

ప్రభాస్ ఎట్టకేలకు రంగంలోకి..

దిగాడుప్రభాస్ త్వరలోనే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగా గత ఏడాది ఒకటికి మూడు భారీ చిత్రాలను అతను అనౌన్స్ చేశాడు. అందులో ముందుగా ప్రకటించింది నాగ్ అశ్విన్ మూవీనే. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కించడానికి ప్రణాళికలు వేసుకున్నారు.

ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ కాగా.. బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రలకు ఎంపికయ్యారు. ఐతే ఈ సినిమాను ముందే అనౌన్స్ చేసినప్పటికీ.. వీటి తర్వాత ప్రకటించిన ఆదిపురుష్, సలార్ చిత్రాలకే ప్రభాస్ ప్రయారిటీ ఇచ్చాడు. వాటి చిత్రీకరణలోనే ముందు పాల్గొన్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రీకరణ కూడా పూర్తి చేసేసిన ప్రభాస్.. ‘సలార్’ కొత్త షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చాడు. 

ఐతే ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న నాగ్ అశ్విన్ సినిమాను ప్రభాస్ ఎప్పుడు మొదలుపెడతాడా అని అంతా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు ప్రభాస్‌ ఈ సినిమా పని ఆరంభించాడు. ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లింది. కొన్ని రోజుల కిందటే హీరోయిన్ దీపికా పదుకొనే చిత్రీకరణకు హాజరైంది. కొన్ని నెలల ముందే అమితాబ్ బచ్చన్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.

ఇప్పుడు ఎట్టకేలకు ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ సరికొత్త లుక్‌లోకి మారబోతున్నాడట. ఈ సినిమా ఒక కొత్త ప్రపంచంలో నడుస్తుందని.. ఇందులో కనిపించే ప్రతి వస్తువూ కొత్తగా ఉంటుందని.. అలాగే ఇందులో కనిపించే వాహనాలు కూడా ఎక్కడా చూడని విధంగా ఉంటాయని.. ఇవన్నీ సిద్ధం చేయడానికి ప్రి ప్రొడక్షన్‌కు చాలా టైం పడుతోందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2023లో రిలీజవుతుందని అంచనా వేస్తున్నారు.

Satya

Recent Posts

రాకా కోసం అట్లీ ముందు చూపు!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…

4 hours ago

రేట్ల కోసం వెట్ చెయ్… కోట్లు పోగొట్టుకో

ఒక‌ప్పుడు ఎంత పెద్ద సినిమా వ‌చ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బ‌డ్జెట్ ఎంత అయినా స‌రే.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన…

7 hours ago

5 రూపాయల డాక్టరుగా సూర్య ?

కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…

9 hours ago

పవన్ వ్యాఖలకు తెలంగాణ నాయకుల కౌంటర్… ఇదేం స్పీడు గురు

తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…

10 hours ago

పవన్ 11 రోజులు అన్నం తిననిది ఇందుకా

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…

10 hours ago

జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…

10 hours ago