కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు, అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా హఠాత్తుగా చనిపోయాడు. గుండెపోటుతో అతను ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు.
నిన్నటి వరకు హుషారుగా కనిపించిన చిరంజీవి ఇలా చనిపోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. అతను చివరగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటో, టిక్ టాక్లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చిరంజీవి సన్నిహితులు, అభిమానుల గుండెె బరువెక్కుతోంది. చిరంజీవి చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ ఫొటో షేర్ చేశాడు.
తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చిన్నతనంలో దిగిన ఫొటోను అనుకరిస్తూ మళ్లీ అతను వాళ్లతో కలిసి ఫొటో దిగాడు. అప్పుడు ఇప్పుడు తాము ముగ్గురం ఒకేలా ఉన్నాం కదూ అని కామెంట్ జోడించాడు. అడోరబుల్ పిక్ అంటూ దీనికి ఫాలోవర్లు కామెంట్లు జోడించారు. ఇంకో 20 ఏళ్లకు కూడా మీలో మార్పు ఉండదు.. ఇలాగే కలిసి ఫొటో దిగాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రాత్రి ఈ ఫొటో షేర్ చేసిన చిరంజీవి ఉదయానికి ప్రాణాలు వదలడం అభిమానులకు పెద్ద షాకే. మరోవైపు ఇటీవల చిరంజీవి ఒక టిక్ టాక్ వీడియో చేశాడు.
ముందుగా అందులో నువ్వు ఇంత బాధలోనూ అంత సంతోషంగా ఎలా ఉంటావని రజనీ డైలాగ్ ప్లే అవతుంది. తర్వాత ‘‘నేను చక్రవర్తిని’’ అంటూ పాత తమిళ పాట ప్లే అవుతుంది. చివరగా విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’లోని ‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా’’ అన్న పాట పల్లవితో ఈ వీడియో ముగుస్తుంది.
జీవితం చాలా చిన్నది అని ముందే సంకేతం ఇచ్చి చిరంజీవి ఇలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’లో రెండో హీరోయిన్గా నటించిన మేఘనా రాజ్.. చిరంజీవితో పదేళ్ల పాటు ప్రేమలో ఉండి రెండేళ్ల కిందటే అతణ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె ప్రెగ్నెంట్ అంటుండటం విచారకరమైన విషయం.
This post was last modified on June 8, 2020 3:24 pm
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…