కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు, అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా హఠాత్తుగా చనిపోయాడు. గుండెపోటుతో అతను ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు.
నిన్నటి వరకు హుషారుగా కనిపించిన చిరంజీవి ఇలా చనిపోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. అతను చివరగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటో, టిక్ టాక్లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చిరంజీవి సన్నిహితులు, అభిమానుల గుండెె బరువెక్కుతోంది. చిరంజీవి చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ ఫొటో షేర్ చేశాడు.
తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చిన్నతనంలో దిగిన ఫొటోను అనుకరిస్తూ మళ్లీ అతను వాళ్లతో కలిసి ఫొటో దిగాడు. అప్పుడు ఇప్పుడు తాము ముగ్గురం ఒకేలా ఉన్నాం కదూ అని కామెంట్ జోడించాడు. అడోరబుల్ పిక్ అంటూ దీనికి ఫాలోవర్లు కామెంట్లు జోడించారు. ఇంకో 20 ఏళ్లకు కూడా మీలో మార్పు ఉండదు.. ఇలాగే కలిసి ఫొటో దిగాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రాత్రి ఈ ఫొటో షేర్ చేసిన చిరంజీవి ఉదయానికి ప్రాణాలు వదలడం అభిమానులకు పెద్ద షాకే. మరోవైపు ఇటీవల చిరంజీవి ఒక టిక్ టాక్ వీడియో చేశాడు.
ముందుగా అందులో నువ్వు ఇంత బాధలోనూ అంత సంతోషంగా ఎలా ఉంటావని రజనీ డైలాగ్ ప్లే అవతుంది. తర్వాత ‘‘నేను చక్రవర్తిని’’ అంటూ పాత తమిళ పాట ప్లే అవుతుంది. చివరగా విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’లోని ‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా’’ అన్న పాట పల్లవితో ఈ వీడియో ముగుస్తుంది.
జీవితం చాలా చిన్నది అని ముందే సంకేతం ఇచ్చి చిరంజీవి ఇలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’లో రెండో హీరోయిన్గా నటించిన మేఘనా రాజ్.. చిరంజీవితో పదేళ్ల పాటు ప్రేమలో ఉండి రెండేళ్ల కిందటే అతణ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె ప్రెగ్నెంట్ అంటుండటం విచారకరమైన విషయం.
This post was last modified on June 8, 2020 3:24 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…