కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటుడు, అర్జున్ మేనల్లుడు అయిన చిరంజీవి సర్జా హఠాత్తుగా చనిపోయాడు. గుండెపోటుతో అతను ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచాడు.
నిన్నటి వరకు హుషారుగా కనిపించిన చిరంజీవి ఇలా చనిపోవడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. అతను చివరగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటో, టిక్ టాక్లో పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి చిరంజీవి సన్నిహితులు, అభిమానుల గుండెె బరువెక్కుతోంది. చిరంజీవి చనిపోవడానికి ముందు రోజు రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక స్పెషల్ ఫొటో షేర్ చేశాడు.
తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చిన్నతనంలో దిగిన ఫొటోను అనుకరిస్తూ మళ్లీ అతను వాళ్లతో కలిసి ఫొటో దిగాడు. అప్పుడు ఇప్పుడు తాము ముగ్గురం ఒకేలా ఉన్నాం కదూ అని కామెంట్ జోడించాడు. అడోరబుల్ పిక్ అంటూ దీనికి ఫాలోవర్లు కామెంట్లు జోడించారు. ఇంకో 20 ఏళ్లకు కూడా మీలో మార్పు ఉండదు.. ఇలాగే కలిసి ఫొటో దిగాలి అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రాత్రి ఈ ఫొటో షేర్ చేసిన చిరంజీవి ఉదయానికి ప్రాణాలు వదలడం అభిమానులకు పెద్ద షాకే. మరోవైపు ఇటీవల చిరంజీవి ఒక టిక్ టాక్ వీడియో చేశాడు.
ముందుగా అందులో నువ్వు ఇంత బాధలోనూ అంత సంతోషంగా ఎలా ఉంటావని రజనీ డైలాగ్ ప్లే అవతుంది. తర్వాత ‘‘నేను చక్రవర్తిని’’ అంటూ పాత తమిళ పాట ప్లే అవుతుంది. చివరగా విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’లోని ‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా’’ అన్న పాట పల్లవితో ఈ వీడియో ముగుస్తుంది.
జీవితం చాలా చిన్నది అని ముందే సంకేతం ఇచ్చి చిరంజీవి ఇలా అర్ధంతరంగా జీవితాన్ని ముగించాడంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘బెండు అప్పారావు ఆర్ఎంపీ’లో రెండో హీరోయిన్గా నటించిన మేఘనా రాజ్.. చిరంజీవితో పదేళ్ల పాటు ప్రేమలో ఉండి రెండేళ్ల కిందటే అతణ్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడామె ప్రెగ్నెంట్ అంటుండటం విచారకరమైన విషయం.
This post was last modified on June 8, 2020 3:24 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…