అల్లు అర్జున్ని లారీ డ్రైవర్గా మార్చి.. రష్మిక మందాన్నని పల్లెటూరి యువతిగా చేంజ్ చేసేసి.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ లాంటి వారందరినీ డిఫరెంట్ లుక్స్లోకి షిఫ్ట్ చేసి.. ‘పుష్ప’ని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా చెక్కుతున్నాడు సుకుమార్. అలాంటి సినిమాలో సమంతని స్పెషల్ సాంగ్ చేయడానికి తీసుకుంటే ఎలా ఉంటుంది! ఆల్రెడీ ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపైపోయాయి.
ఇంతమంది డిఫరెంట్గా కనిపిస్తున్న ఈ చిత్రంలో సమంత ఎలా కనిపించనుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. దానికి రెండు రోజుల్లో తెరపడబోతోంది. సమంత సాంగ్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ సాగే ఈ పాటతో ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ గ్యారంటీ అని చెప్పడానికి ఓ పోస్టర్ను కూడా వదిలింది.
ఇందులో సామ్ కనిపించీ కనిపించకుండా ఉన్నా.. ఆమె సొగసు మాత్రం కళ్లలో జొరబడుతోంది. సూటిగా పోయి గుండెల్ని పట్టి లాగేసేలా ఉంది. బ్లూ కలర్ డ్రెస్లో, సూదంటు చూపులతో ఖతర్నాక్ లుక్లో కనిపించి మురిపిస్తోంది సమంత. చేయి చాపి రమ్మని రా రమ్మని పిలుస్తోంది. పాట సంగతెలా ఉన్నా ఈ పోస్టర్తోనే సగం ఫ్లాట్ చేశారని చెప్పొచ్చు.
సుకుమార్ సినిమాల్లో మిగతా పాటలన్నీ ఒకెత్తు. ఐటమ్ సాంగ్స్ ఒకెత్తు. ప్రతిదీ సూపర్ డూపర్ హిట్టు. ఇదీ ఆ స్థాయిలోనే ఉండబోతోందని సామ్ గెటప్ చూస్తే అర్థమైపోతోంది. ఈ సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ద ఇయర్కి రాక్స్టార్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడట. చంద్రబోస్ ఊరమాస్ లిరిక్స్ రాశారట. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పాట రిలీజ్ కానుంది. అంటే మరో రెండు రోజుల్లో సామ్ సాంగ్తో దేశమంతా సెగలు రేగుతాయన్నమాట.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…