భీమ్లానాయక్ సంక్రాంతి రిలీజ్ గురించి ప్రకటన వచ్చిన కొన్ని నెలలు దాటింది. కానీ పక్కాగా పండక్కే సినిమా రిలీజవుతుందన్న నమ్మకం మాత్రం కలగట్లేదు. ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7కు ఖరారైన దగ్గర్నుంచి ‘భీమ్లా నాయక్’ విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని మీడియాలో.. సోషల్ మీడియాలో రావడం.. ఆ వార్తల్ని చిత్ర బృందం ఖండించడం.. జనవరి 12నే రిలీజ్ అంటూ ప్రతి కొత్త ప్రోమోలోనూ నొక్కి వక్కాణించడం.. ఇదీ వరస. నిన్న కూడా ఇలాంటి ప్రచారమే జరగ్గా.. నిర్మాత నాగవంశీ వెంటనే స్పందించాడు.
‘భీమ్లా నాయక్’ సంక్రాంతికే వస్తుందని తేల్చి చెప్పాడు. అయినా సరే.. ప్రచారం ఆగట్లేదు. ఈ చిత్రం ఫిబ్రవరి 25కు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి దాదాపు నెల రోజులుగా ఇండస్ట్రీలో అన్ని వైపుల నుంచీ విపరీతమైన ఒత్తిడి వస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు సహా ఎంతోమంది ‘భీమ్లా నాయక్’ టీం మీద ప్రెజర్ పెడుతూనే ఉన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా ప్రైడ్ అని.. దాని మీద బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టారని.. దానికి థియేటర్ల సమస్య రాకుండా చూడటం కోసం ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాలి అన్నది వారి మాట. ఐతే కేవలం ‘భీమ్లా నాయక్’ను మాత్రమే ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. సంక్రాంతికి మరో పెద్ద సినిమా ‘రాధేశ్యామ్’ కూడా షెడ్యూల్ అయి ఉంది.
అది రేసు నుంచి తప్పుకోవాలన్న మాట ఎవ్వరి నుంచీ రావడం లేదు. దాని ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఏమన్నా అంటే అది పాన్ ఇండియా మూవీ, డేట్ మార్చడం కష్టం అంటున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసమని జనవరి 6న రావాల్సిన ఆలియా భట్ మూవీ ‘గంగూబాయి’ని వాయిదా వేయించినపుడు ‘రాధేశ్యామ్’కు కూడా డేట్ మార్పించవచ్చు కదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ‘భీమ్లా నాయక్’ తప్పుకుంటే.. పరిమిత సంఖ్యలోనే థియేటర్లలో ‘బంగార్రాజు’ను రిలీజ్ చేద్దామని నాగ్ చూస్తున్నాడు. మరి ఆ సినిమా విషయంలోనూ అభ్యంతరాలు లేవు కానీ.. ఒక్క ‘భీమ్లా నాయక్’ను మాత్రమే రేసు నుంచి తప్పించడానికి ఇంతగా ఒత్తిడి తేవడం ఎంత వరకు న్యాయం?
This post was last modified on December 8, 2021 3:07 pm
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…
మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…