నందమూరి బాలకృష్ణ వీక్ ఏరియాస్లో నైజాం ఒకటన్న సంగతి తెలిసిందే. బాలయ్య హిట్ సినిమాలు కూడా తెలంగాణలో అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టవు. హైదరాబాద్లో ఓ మోస్తరుగా స్పందన ఉంటుంది కానీ.. మిగతా ప్రాంతాల్లో వసూళ్లు సినిమా స్థాయికి తగినట్లు రావు. ఇటు రాయలసీమలో, అటు ఆంధ్రాలో మాత్రం బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు బాగుంటాయి.
గత కొన్నేళ్లలో బాలయ్య చిత్రాల్లో బాగా ఆడిన వాటికి కూడా నైజాంలో వసూళ్లు తక్కువగానే కనిపిస్తాయి. అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకు మిగతా ఏరియాలతో పోలిస్తే నైజాంలో బిజినెస్ కూడా తక్కువగానే అవుతుంటుంది. ఐతే ఈ ట్రెండును ఇప్పుడు ‘అఖండ’ మార్చేస్తోంది. ఈ సినిమాకు మిగతా చోట్ల మాదిరే నైజాంలోనూ అదిరిపోయే స్పందన వస్తోంది. ఆ రెస్పాన్స్ ఏ రేంజిలో ఉందంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయేంత.
అఖండ సినిమాకు నైజాంలో థియేట్రికల్ హక్కులు రూ.10.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఐతే తొలి రోజే తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రానికి అనూహ్యంగా రూ.6.6 కోట్ల గ్రాస్, రూ.4.4 కోట్ల షేర్ వచ్చింది. తర్వాతి రెండు రోజుల్లోనూ ఈ సినిమా ఈ ప్రాంతంలో జోరు కొనసాగించింది. శుక్ర, శనివారాల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ.4.5 కోట్ల షేర్ వచ్చింది. మూడు రోజుల షేర్ రూ.9.1 కోట్లు కాగా.. ఆదివారం సినిమా హౌస్ఫుల్స్తో రన్ అవుతోంది. సెకండ్ షోలు అయ్యేసరికి ఈ చిత్రం లాభాల బాట పట్టడం లాంఛనమే.
ఆంధ్రా, రాయలసీమల్లో మాదిరే ఇక్కడా ‘అఖండ’ను ఇక్కడ మెజారిటీ థియేటర్లలో రిలీజ్ చేయగా.. తర్వాతి రెండు రోజుల్లో కొత్త సినిమాల కోసం కొన్ని థియేటర్లు తీసేసి.. మళ్లీ వాటికి సరైన స్పందన లేకపోవడం, ‘అఖండ’ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తిరిగి దానికి స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్, కరీంనగర్ లాంటి బాలయ్య వీక్ ఏరియాస్లో కూడా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. ఫుల్ రన్లో నైజాం బయ్యర్లకు భారీ లాభాలే అందించేలా కనిపిస్తోంది ‘అఖండ’.
This post was last modified on December 5, 2021 10:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…