నందమూరి బాలకృష్ణ వీక్ ఏరియాస్లో నైజాం ఒకటన్న సంగతి తెలిసిందే. బాలయ్య హిట్ సినిమాలు కూడా తెలంగాణలో అనుకున్నంత మేర వసూళ్లు రాబట్టవు. హైదరాబాద్లో ఓ మోస్తరుగా స్పందన ఉంటుంది కానీ.. మిగతా ప్రాంతాల్లో వసూళ్లు సినిమా స్థాయికి తగినట్లు రావు. ఇటు రాయలసీమలో, అటు ఆంధ్రాలో మాత్రం బాలయ్య సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లు బాగుంటాయి.
గత కొన్నేళ్లలో బాలయ్య చిత్రాల్లో బాగా ఆడిన వాటికి కూడా నైజాంలో వసూళ్లు తక్కువగానే కనిపిస్తాయి. అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకు మిగతా ఏరియాలతో పోలిస్తే నైజాంలో బిజినెస్ కూడా తక్కువగానే అవుతుంటుంది. ఐతే ఈ ట్రెండును ఇప్పుడు ‘అఖండ’ మార్చేస్తోంది. ఈ సినిమాకు మిగతా చోట్ల మాదిరే నైజాంలోనూ అదిరిపోయే స్పందన వస్తోంది. ఆ రెస్పాన్స్ ఏ రేంజిలో ఉందంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయేంత.
అఖండ సినిమాకు నైజాంలో థియేట్రికల్ హక్కులు రూ.10.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ఐతే తొలి రోజే తెలంగాణ ప్రాంతంలో ఈ చిత్రానికి అనూహ్యంగా రూ.6.6 కోట్ల గ్రాస్, రూ.4.4 కోట్ల షేర్ వచ్చింది. తర్వాతి రెండు రోజుల్లోనూ ఈ సినిమా ఈ ప్రాంతంలో జోరు కొనసాగించింది. శుక్ర, శనివారాల్లో ఈ చిత్రానికి నైజాంలో రూ.4.5 కోట్ల షేర్ వచ్చింది. మూడు రోజుల షేర్ రూ.9.1 కోట్లు కాగా.. ఆదివారం సినిమా హౌస్ఫుల్స్తో రన్ అవుతోంది. సెకండ్ షోలు అయ్యేసరికి ఈ చిత్రం లాభాల బాట పట్టడం లాంఛనమే.
ఆంధ్రా, రాయలసీమల్లో మాదిరే ఇక్కడా ‘అఖండ’ను ఇక్కడ మెజారిటీ థియేటర్లలో రిలీజ్ చేయగా.. తర్వాతి రెండు రోజుల్లో కొత్త సినిమాల కోసం కొన్ని థియేటర్లు తీసేసి.. మళ్లీ వాటికి సరైన స్పందన లేకపోవడం, ‘అఖండ’ టికెట్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో తిరిగి దానికి స్క్రీన్లు, షోలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. వరంగల్, కరీంనగర్ లాంటి బాలయ్య వీక్ ఏరియాస్లో కూడా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. ఫుల్ రన్లో నైజాం బయ్యర్లకు భారీ లాభాలే అందించేలా కనిపిస్తోంది ‘అఖండ’.
This post was last modified on December 5, 2021 10:35 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…