బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీను టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ కుదరలేదు. నిజానికి ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా నర్గీస్ ఫక్రీను తీసుకోవాలనుకున్నారు. అనూహ్యంగా సమంత ప్రాజెక్ట్ లోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు క్రిష్ ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కి చోటు ఉండడంతో దానికోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఎంపిక చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఓ కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది.
ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో పవన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అంటే ఏ హీరోయిన్ కాదంటుంది. కాబట్టి కచ్చితంగా నర్గీస్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
This post was last modified on December 5, 2021 10:28 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…