బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీను టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ కుదరలేదు. నిజానికి ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా నర్గీస్ ఫక్రీను తీసుకోవాలనుకున్నారు. అనూహ్యంగా సమంత ప్రాజెక్ట్ లోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు క్రిష్ ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కి చోటు ఉండడంతో దానికోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఎంపిక చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఓ కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది.
ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో పవన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అంటే ఏ హీరోయిన్ కాదంటుంది. కాబట్టి కచ్చితంగా నర్గీస్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
This post was last modified on December 5, 2021 10:28 pm
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…