బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీను టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ కుదరలేదు. నిజానికి ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా నర్గీస్ ఫక్రీను తీసుకోవాలనుకున్నారు. అనూహ్యంగా సమంత ప్రాజెక్ట్ లోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు క్రిష్ ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కి చోటు ఉండడంతో దానికోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఎంపిక చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఓ కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది.
ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో పవన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అంటే ఏ హీరోయిన్ కాదంటుంది. కాబట్టి కచ్చితంగా నర్గీస్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
This post was last modified on December 5, 2021 10:28 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…