బాలీవుడ్ ముద్దుగుమ్మ నర్గీస్ ఫక్రీను టాలీవుడ్ కి పరిచయం చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు అనుకున్నారు. కానీ కుదరలేదు. నిజానికి ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ముందుగా నర్గీస్ ఫక్రీను తీసుకోవాలనుకున్నారు. అనూహ్యంగా సమంత ప్రాజెక్ట్ లోకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు క్రిష్ ఈ బాలీవుడ్ బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కి చోటు ఉండడంతో దానికోసం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఎంపిక చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఓ కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది.
ఇలాంటి సమయంలో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో పవన్ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె స్థానంలో నర్గీస్ ఫక్రీను తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ అంటే ఏ హీరోయిన్ కాదంటుంది. కాబట్టి కచ్చితంగా నర్గీస్ ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.
This post was last modified on December 5, 2021 10:28 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…