ఒక సినిమా హీరోకు ఒక ప్రకటనలో నటించడం కోసం 265 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నామా.. అది కూడా ఒక్క రోజులో ఆ యాడ్ షూట్ పూర్తి చేస్తామని చెబితే అది ఎంత పెద్ద ఆఫరో చెప్పేదేముంది? ప్రపంచంలో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే.. ఈ ఆఫర్ను తిరస్కరిస్తాడా? కళ్లు మూసుకుని కాల్ షీట్ ఇచ్చేయకుండా ఉంటాడా? కానీ హాలీవుడ్ స్టార్ జార్జ్ క్లూనీ మాత్రం ఈ బంపర్ ఆఫర్ను తిరస్కరించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు.
ఒక దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ కంపెనీ.. తమ సంస్థకు సంబంధించిన యాడ్లో నటించేందుకు జార్జ్ క్లూనీకి 35 మిలియన్ యుఎస్ డాలర్లు ఆఫర్ చేసిందట. అంటే ఆ మొత్తం భారతీయ కరెన్సీలో అయితే అక్షరాలా 265 కోట్ల రూపాయలు. కేవలం ఒక్క రోజు షూట్తో ఈ ప్రకటన పూర్తి చేస్తామని కూడా చెప్పారట. కానీ అతను ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.
అందుక్కారణం… ఆ విమానయాన కంపెనీ ఏ దేశంలో ఏర్పాటైందో… ఆ దేశం మీద క్లూనీకి సదుద్దేశం లేదట. మానవ హక్కుల ఉల్లంఘనలో సదరు దేశం తరచుగా వార్తల్లో నిలుస్తోందని.. ఇలాంటి దేశానికి చెందిన ఎయిర్ లైన్స్కు తాను ప్రచారం చేయలేనని ఖరాఖండిగా చెప్పేశారట. ఐతే ఆ దేశం, ఆ ఎయిర్ లైన్స్ పేర్లేంటన్నవి వెల్లడి కాలేదు. మన దగ్గరా బోలెడన్ని బ్రాండ్లకు ప్రచారం చేసే సెలబ్రెటీలు ఉన్నారు.
వాళ్లు ప్రచారం చేసే వాటిలో గుట్కా బ్రాండ్లున్నాయి. మద్యం బ్రాండ్లున్నాయి. తాము జీవితంలో ఎప్పుడూ ముట్టుకోని, ప్రమాదకర ఉత్పత్తులకు వాళ్లు ప్రచారం చేస్తుంటారు. తద్వారా తమ అభిమానులు, యువతను ప్రభావితం చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్న సూచనల్ని అస్సలు పట్టించుకోరు. ఇలాంటి నేపథ్యంలో జార్జ్ క్లూనీ వందల కోట్ల విలువైన డీల్ను తన విలువల కోసం కాదనుకోవడం విశేషమే.
This post was last modified on December 5, 2021 9:01 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…