కరోనా సమయంలో ఓటీటీలకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలు సైతం నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే థియేటర్లు తెరుచుకోవడంతో పేరున్న సినిమాలేవీ కూడా ఓటీటీలో రావడం లేదు. చిన్న సినిమాలను మాత్రమే ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. పైగా ‘అఖండ’ సక్సెస్ చాలా మందికి బూస్టప్ ఇచ్చింది. కాబట్టి పరిస్థితులు బాగోకపోతే తప్ప ఇప్పట్లో ఏ సినిమా కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ కాదు. ఇలాంటి సమయంలో రాజశేఖర్ సినిమాను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.
మలయాళం లో హిట్ అయిన ‘జోసెఫ్’ అనే సినిమాకి రీమేక్ గా ‘శేఖర్’ సినిమాను తెరకెక్కించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమాను ముందు ఓ కొత్త డైరెక్టర్ తో మొదలుపెట్టారు. కానీ ఈక్వేషన్స్ మారడంతో జీవితా రాజశేఖర్ డైరెక్టర్ గా ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కోసం కొన్ని ఓటీటీ సంస్థలు ఫ్యాన్సీ డీల్ ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం రూ.25 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఆల్రెడీ హిట్ అయిన కథ, పైగా ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ఈ రేంజ్ లో ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇది మంచి డీల్ అనే చెప్పాలి. కానీ సినిమాకి వస్తోన్న బజ్ చూసిన దర్శకనిర్మాతలు థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తే బిజినెస్ పరంగా బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. సరైన డేట్ దొరికితే థియేటర్లలో సినిమాను విడుదల చేసి.. ఆ తరువాత ఓటీటీకి అమ్మాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on December 3, 2021 1:26 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…