‘నరసింహ నాయుడు’ తర్వాత నందమూరి బాలకృష్ణ కెరీర్ ఎప్పుడూ అంత నిలకడగా, సవ్యంగా సాగింది లేదు. ఆ చిత్రం తర్వాత ఎనిమిదేళ్లకు పైగా ఆయనకు విజయం లేదు. ఆ స్థితిలో ‘సింహా’ సినిమాతో బాలయ్యకు అత్యావశ్యకమైన విజయాన్నందించాడు బోయపాటి శ్రీను. ఆపై మళ్లీ బాలయ్య కెరీర్ గాడి తప్పింది. ఆ స్థితిలో బాలయ్యను మరోసారి ఆదుకుంది బోయపాటినే. వీరి కలయికలో వచ్చిన ‘లెజెండ్’ కూడా సూపర్ హిట్ కావడం తెలిసిందే. కానీ ఆ స్థాయి విజయం బాలయ్యకు మళ్లీ దక్కలేదు. పైగా యన్.టి.ఆర్, రూలర్ సినిమాలు పెద్ద డిజాస్టర్లు కావడంతో బాలయ్య కెరీర్ మరింత పతనమైంది కూడా. ఈ స్థితిలో మళ్లీ బాలయ్య బోయపాటినే నమ్ముకున్నాడు.
వీరి కలయికలో మరో సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా లేకపోయినా సరే.. ఈ సినిమాకు కళ్లు చెదిరే ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రం హౌస్ఫుల్స్తో ఆడింది.రెండో రోజు కూడా ‘అఖండ’ జోరు తగ్గించేలా లేదు. మొత్తానికి ‘అఖండ’ బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయాన్నందుకునేలాగే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య చాలా రిలాక్స్డ్గా కనిపించాడు గురువారం రాత్రి జరిగిన ప్రెస్ మీట్లో. హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో దర్శకుడు బోయపాటితో కలిసి సినిమా చూసిన అనంతరం బాలయ్య.. ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. అందులో బాలయ్యను చూసి అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య అంత కూల్గా, రిలాక్స్డ్గా కనిపిస్తూ ప్రశాంతంగా.. తడబాటు లేకుండా మీడియాతో మాట్లాడటం అరుదు.
మళ్లీ మంచి విజయాన్నందుకున్న నేపథ్యంలో బాలయ్య చాలా రిలాక్స్డ్గా ఉన్నట్లున్నాడు. ఆయన ఈ ప్రెస్ మీట్లో చాలా సరదాగా కూడా మాట్లాడారు. ఇంటర్వెల్లో పిల్లలు కొందరు తనను అంకుల్ అన్నారని.. అది నచ్చలేదని.. తనను తాత అనాల్సిందని నవ్వేశాడు బాలయ్య. అంతే కాక మధ్యలో దర్శకుడు బోయపాటి తనకు ‘అఖండ’ సినిమాకు సంబంధించి రాయల్టీ ఇవ్వాలని బాలయ్య వ్యాఖ్యానించడం విశేషం. మామూలుగా తాను దేవుడిని చూపించు అన్న వాళ్లను ఒక దెబ్బ కొట్టి మాట్లాడతానని.. ఆ నొప్పి కనిపించిందా అని అడిగి, అదే దేవుడు అంటానని.. తన దగ్గర అది గమనించే ‘‘దేవుడిని కరుణించు అనాలి. కనిపించు అని కాదు’’ అని డైలాగ్ పెట్టి ఉంటాడని, అందుకే తనకు రాయల్టీ ఇవ్వాలని బాలయ్య వ్యాఖ్యానించడం విశేషం.
This post was last modified on December 3, 2021 1:12 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…